సుప్రీంలో వాయిదా అనంతరం... అయోధ్య రామమందిరంపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే
న్యూఢిల్లీ: 2019 లోకసభ ఎన్నికలకు అయోధ్య రామ మందిరం ప్రధాన అంశం కాదని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం చెప్పారు. రామ మందిరంపై సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేసిన కాసేపటికే ఆయన స్పందించారు. ఈ అంశంపై స్పందించాలని మీడియా అడిగింది.
దానికి రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని, అందువల్ల దీనిపై తాను ఏమీ మాట్లాడనని చెప్పారు. అలాగే ఈ అంశం 2019కి ప్రాధాన్యతాంశం కాదని, నిరుద్యోగం, అవినీతి అజెండా అన్నారు.

కాగా, అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేసు విచారణ మరోసారి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లు ఈ రోజు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎస్కే కౌల్లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చాయి. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు వినకుండానే విచారణను ధర్మాసనం జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది. శుక్రవారం ఈ కేసు విచారణ కనీసం 30 సెకన్లు కూడా సాగలేదు.
అయోధ్య కేసు విచారణ ప్రారంభం కాగానే ఈ కేసులో విచారణకు తేదీల ఖరారుపై జనవరి 10న తగిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేస్తుందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఇరుపక్షాల తరఫున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వె, రాజీవ్ ధవన్ల నుంచి ఎలాంటి వాదనలు వినలేదు. వాయిదా వేసింది.
అయోధ్య అంశంపై గతంలో దాఖలైన నాలుగు సివిల్ పిటిషన్లపై అలహాబాద్ హైకోర్టు 2010లో తీర్పు ఇచ్చింది. వివాదానికి సంబంధించి మొత్తం 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్లల్లాలకు సమానంగా పంచాలని చెప్పింది. కానీ ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పద్నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని స్వీకరించిన కోర్టు పిటిషన్లపై జనవరి మొదటి వారంలో తగిన ధర్మాసనం విచారణ చేపడుతుందని గతేడాది అక్టోబరు 29న నిర్ణయించింది. తాజాగా ఇప్పుడు మరోసారి వాయిదా వేసింది.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications