Ramya: బెంగళూరు ఎయిర్ పోర్టులో నటి రమ్యాకు కోవిడ్ పరీక్షలు, ఎం జరిగింది ? ఏం చెప్పారంటే ?, రీ ఎంట్రీ !
బెంగళూరు: రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ దెబ్బతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. కరోనా వైరస్ దెబ్బ నుంచి కోలుకుంటున్నామని ఇప్పుడిప్పుడే అనుకుంటున్న ప్రజల నెత్తిన ఇప్పుడు కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicron virus) రూపంలో నెత్తిన పిడుగు పడింది. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు మొదట బెంగళూరులో వెలుగు చూడటంతో ఐటీ హబ్ ప్రజలు హడలిపోతున్నారు. విదేశాలతో పాటు విమానాల్లో ఎవరు వచ్చినా సరే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించి వారిని ఎయిర్ పోర్టు నుంచి బయటకు పంపిస్తున్నారు. ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాజీ చీఫ్ రమ్యా కూడా బెంగళూరు అంతర్జాతీయ విమానశ్రయంలో అడుగుపెట్టింది. ఈ సందర్బంలో ఎయిర్ పోర్టులో ఏం జరిగింది అనే విషయాన్ని నటి రమ్యా వివరించారు. చాలా కాలంగా బెంగళూరుకు దూరంగా ఉంటున్న నటి రమ్యా ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.
Illegal affair: మేనకోడలితో అక్రమ సంబంధం, భర్తకు తెలిసి వార్నింగ్, ఏం చెయ్యలేడని అనుకుంటే !
కరోనా పోయిందని అనుకుంటే ఒమిక్రాన్ వైరస్ వచ్చింది
రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ దెబ్బతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. కరోనా వైరస్ దెబ్బ నుంచి కోలుకుంటున్నామని ఇప్పుడిప్పుడే అనుకుంటున్న ప్రజల నెత్తిన ఇప్పుడు కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ రూపంలో నెత్తిన పిడుగు పడింది. ప్రజలు ఇప్పుడు కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ దెబ్బతో అప్పుడే భయపడిపోతున్నారు.
బెంగళూరులో కొత్త వైరస్ తో హడల్
భారతదేశంలో ఒమిక్రాన్ వైరస్ పాజిటివ్ కేసులు లేవు అని అనుకుంటున్న సమయంలోనే బెంగళూరులో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని వెలుగు చూసింది. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు మొదట బెంగళూరులో వెలుగు చూడటంతో ఐటీ హబ్ ప్రజలు, ఆ రాష్ట్ర ప్రభుత్వం హడలిపోయింది.
ఎయిర్ పోర్టులోనే కోవిడ్ పరీక్షలు
విదేశాలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి విమానాల్లో ఎవరు వచ్చినా సరే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం)లో కోవిడ్ పరీక్షలు నిర్వహించి వారిని ఎయిర్ పోర్టు నుంచి బయటకు పంపిస్తున్నారు. ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాజీ చీఫ్ రమ్యా కూడా బెంగళూరు అంతర్జాతీయ విమానశ్రయంలో అడుగుపెట్టింది.
నటి రమ్యాకు కోవిడ్ పరీక్షలు
ఈ సందర్బంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏం జరిగింది అనే విషయాన్ని నటి రమ్యా సోషల్ మీడియాలో వివరించారు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతిఒక్కరికి చాలా పద్దతిగా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా కోవిడ్ పరీక్షలు చేస్తున్నారని, అక్కడ ఉన్న డాక్టర్లు, నర్సులు, విమానాశ్రయం అధికారులు, సిబ్బంది చాలా కష్టపడుతున్నారని, నిజంగా వారిని మెచ్చుకోవాలని నటి రమ్యా సోష్ మీడియాలో పోస్టు చేశారు.
బెంగళూరుకు మేడమ్ ఎందుకు వచ్చినట్లు ?
నటి రమ్యా కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొనే సమయంలోనే ఆమె సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన నటి తరువాత బెంగళూరుకు దూరం అయ్యి ఎక్కువగా విదేశాల్లోనే ఉంటున్నారు. ఇటీవల స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు హాజరైన నటి రమ్యా తరువాత బెంగళూరు వదిలి వెళ్లిపోయారు. నటి రమ్యా రీ ఎంట్రీ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో ఆమె మళ్లీ బెంగళూరులో అడుగుపెట్టింది. చాలా కాలంగా బెంగళూరుకు దూరంగా ఉంటున్న నటి రమ్యా ఇప్పుడు మరోసారి స్యాండిల్ వుడ్ లో, కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.