అంధురాలిపై 9 మంది అత్యాచారం, న్యాయం చేయకపోతే ఆత్మహత్యే...!
జైపూర్: రాజస్ధాన్లో దారుణం జరిగింది. ఓ అంధురాలిపై మూడు నెలల్లో తొమ్మిది మంది అతికిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్ధాన్లోని మోతాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందనఖేడి గ్రామంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని ఆమె తన ఇంటి ముందు కూర్చుని ఉండగా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఆమెను కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను ఎవరికీ తెలియని ఓ ఇంట్లో ఉంచి మూడు నెలల వ్యవధిలో మొత్తం తొమ్మిది మంది ఆమెపై అత్యాచారం చేశారు.

మోజు తీరిన తర్వాత ఆమెను కోట అనే ఊరిలో రూ. 50 వేలకు అమ్మకానికి పెట్టారు. అంధురాలు కావడంతో ఆమెను ఎవరూ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో చేసేదేమి లేక నిందితుడు ఆమెను తిరిగి ఇంటి ముందు వదిలి వెళ్లిపోయాడు.
బాధితులు తన ఫిర్యాదులో ఇలా పేర్కొందని పోలీసులు తెలిపారు. పోలీసులు తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితులు చెప్పిందన్నారు. దీంతో జిల్లా ఎస్పీ సత్యేంద్ర సింగ్ కేసును పరిష్కరించి బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications