Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీఫ్ తిన్నారని ఇద్దరు మహిళలపై రేప్: అత్తామామల హత్య

మేవాట్‌: హర్యానాలో అతి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. బీఫ్ తిన్నారనే ఆరోపణపై ఇద్దరు యువతులపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డగించిన వారి అత్తామామలను కొట్టి చంపారు. గొడ్డు మాంసం తిన్నందుకు వారు ఈ శిక్ష విధించినట్లు సిగ్గు లేకుండా చెప్పుకున్నారు.

ఈ ఘోరమైన సంఘటన హర్యానాలోని మేవాట్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ మేరకు 20 ఏళ్ల మహిళ, ఆమె కజిన్‌ 14 ఏళ్ల బాలిక ఢిల్లీలో సామాజిక కార్యకర్త షబ్నం హష్మీ సమక్షంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 24న తమ ఇంట్లోకి ప్రవేశించి తమపై అఘాయిత్యానికి పాల్పడ్డారని, బీఫ్‌ తిన్నందుకే మీకు ఈ శిక్ష విధించామని దుండగులు తమతో అన్నట్లు బాధితురాలు చెప్పింది.

'Rapists Asked If I Eat Beef,' Alleges Haryana Woman

అడ్డుకున్న తమ అత్తామామలను కట్టేసి కొట్టడంతో వారు చనిపోయారని తెలిపింది. అయితే ఈ ఘటనపై బాధిత మహిళలుగానీ, వారి కుటుంబీకులుగానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తాము గొడ్డు మాంసం తినలేదని చెప్పినా వినలేదని, తిన్నామని చెప్పాలని ఒత్తిడి చేశారని బాధితురాలు చెప్పింది.

ఈ సంఘటనపై దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. నలుగురిపై పోలీసులు అత్యాచారం కింద, అక్రమ చొరబాటు కింద కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేశారు. అయితే, గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో హత్యానేరం కింద కూడా కేసు నమోదు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+