రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి: పార్సీ అయినప్పటికీ..
ఆదర్శ పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (Ratan Tata) అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. ప్రజల సందర్శన కోసం టాటా పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి ఎన్సీపీఏ (NCPA) గ్రౌండ్స్ కు తరలించారు. అనంతరం గురువారం సాయంత్రం అక్కడ్నుంచి వర్లీ వరకు కొనసాగిన అంతిమయాత్రలో భారీ సంఖ్యలో వందలాది మంది ప్రముఖులు, వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు.
వర్లీ శ్మశానవాటికలో రతన్ టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. అయితే, రతన్ టాటా పార్సీ మతస్థుడైనప్పటికీ.. ఎలక్ట్రిక్ విధానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. రతన్ టాటా బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే.

కాగా, పార్సీల అంత్యక్రియలు హిందూ, ముస్లింల మాదిరి కాకుండా భిన్నంగా ఉంటాయి. మానవ శరీరాన్ని ప్రకృతి బహుమతిగా వారు భావిస్తారు. అందుకే శరీరాన్ని ప్రకృతిక తిరిగి ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తారు. దహనం, ఖననం చేయడం వల్ల ప్రకృతి వనరులైన నీరు, గాలి, అగ్ని కలుషతం అవుతాయని జొరాస్ట్రియన్ల విశ్వాసం. అందుకే వారు ప్రత్యేక విధానంలో అంత్యక్రియలు చేస్తారు. అంత్యక్రియలకు ముందు పార్సీ సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు చేస్తారు.
Who is this guy #ShantanuNaidu ?
— @¥U$# (@aesth_ayush) October 10, 2024
can anyone explain, why is he trending on Tata Sir's funeral ?#RatanTata #ShantanuNaidu#RatanTataSir रतन टाटा
RIP Legend#RatanTataPassedAway pic.twitter.com/MudLPvY8Tq
అనంతరం పార్థివదేహాన్ని అంత్యక్రియల కోసం నిర్దేశించిన ప్రత్యేక ప్రదేశానికి తీసుకెళ్తారు. దాన్ని టవర్ ఆఫ్ సైలెన్స్ లేదా దఖ్మా అని పిలుస్తారు. రాబందులు వచ్చి తినేందుకు వీలుగా ఆ ప్రదేశంలో పార్థివదేహాన్ని ఉంచుతారు. ఈ మొత్తం పద్ధతిని దోఖ్ మేనాశీనిగా పేర్కొంటారు. మన దేహం ప్రకృతి నుంచి వచ్చింది అలాగే తిరిగి ఐక్యమవ్వాలనేది వీరి ఆశయం కావడం గమనార్హం.
Mumbai police gun selute de kar sammanit kar Rahi hai ❤️🙏🥺#RatanTataSir #RIP_RatanTata pic.twitter.com/uVLDxEn0iT
— Souvik..🇮🇳🚩 (@SouvikHindu) October 10, 2024
అయితే, పార్సీల సంప్రదాయం ఇలా ఉన్నప్పటికీ.. మారుతున్న పర్యావరణ పరిస్థితులు, రాబందుల సంఖ్య బాగా తగ్గిపోవడం వంటి సమస్యల కారణంగా దఖ్మా పద్ధతిని అనుసరించడం వారికి అసాధ్యంగా మారింది. దీంతో సోలార్ లేదా విద్యుత్ విధానంలో దహన వాటికల్లోనే పార్సీలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. నీరు, అగ్ని, నేల కాలుష్యం కాకుండా జొరాష్ట్రియన్ నియామాలకు అనుగుణంగా అంతిమ సంస్కారాలు కొనసాగిస్తున్నారు. రతన్ టాటా అంత్యక్రియలు కూడా కూడా ఈ విధానంలో జరిగాయి. రతన్ టాటా అంత్యక్రియల్లో పార్సీలతోపాటు అన్ని మతాల గురువులు ప్రార్థనలు చేయడం గమనార్హం.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications