నటి రమ్యను నెత్తిన పెట్టుకున్న పాకిస్థాన్ మీడియా
బెంగళూరు: పాకిస్థాన్ కు వెళ్లడం పెద్ద నరకం కాదని, అక్కడి ప్రజలు మనలాంటి మంచి వారే అంటూ కితాబు ఇచ్చిన మాజీ ఎంపీ, బహుబాష నటి రమ్యను ఇప్పుడు పాకిస్థాన్ వార్త సంస్థలు నెత్తిన పెట్టుకుంటున్నాయి.
పాకిస్థాన్ కు చెందిన ది డాన్, నేషన్ ఇంగ్లీష్, జంగ్ ఉర్దూ పత్రికలు రమ్య వార్తలకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. బ్యానర్ ఐటమ్ లు చేస్తున్నారు. అంతే కాకుండ రమ్య విషయంలో ఎప్పుడు ఏమి జరిగింది అనే వార్తలను ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేస్తున్నారు.
పాకిస్తాన్ను పొగిడిన నటి రమ్య, దుమ్మెత్తిపోసిన నెటిజన్లు
పాకిస్థాన్ గురించి రమ్య ఇచ్చిన స్టేట్ మెంట్, ఆమె మీద దేశద్రోహం కేసు నమోదు అయిన విషయం, రమ్యపై విరుచుకుపడుతున్న నెటిజన్లు, రాజకీయ నాయకుల గురించి ది డాన్ పత్రిక ప్రచురించింది.
రమ్యను నెత్తిన పెట్టుకుంటున్న పాకిస్థాన్ పత్రికలు ఆమెకు ఎక్కడలేని ప్రచారం చేస్తున్నాయి. రమ్య మాత్రం తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని, తాను క్షమాపణ చెప్పనని మొండికేస్తున్నారు.
పాకిస్థాన్ కు వెళ్లడమంటే నరకానికి వెళ్లడమే అని కేంద్ర రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలు తప్పు అంటూ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకురాలు రమ్య ఇచ్చిన స్టేట్ మెంట్ చివరికి కోర్టు వరకు వెళ్లింది.