Relationship: తండ్రి అక్రమ సంబంధం, ఆస్తులు దానం, విసిగిపోయిన కొడుకు, చెరుకు తోటలో చెక్ !
ముజఫర్ నగర్: భార్య, వయసు వచ్చిన కొడుకును గాలికి వదిలేసిన తండ్రి అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. భార్యతో పాటు కొడుకు కూడా నీ పద్దతి మార్చుకోవాలని అతనికి పదేపదే బుద్దిమాటలు చెప్పారు. కుక్క తోక వంకర అంటూ అతని ఆడిందే ఆటగా పాడిందే పాటగా తయారైయ్యింది. భార్య, కొడుకు, బంధువులతో పాటు తెలిస వాళ్లు ఎంత చెప్పినా అతను మాత్రం పద్దతి మార్చుకోలేదు. ఊర్లో అందరూ అయిపోవడంతో ఎర్రగా బుర్రగా ఉండే పక్క ఊరి వాళ్ల కోసం వెంపర్లాడాడు. ఇంట్లో భార్యను పట్టించుకోవడం వదిలేసిన భర్త పరాయి మహిళలతో ఎంజాయ్ చేశాడు.
తన పేరుతో ఉన్న ఆస్తులు వేరే వ్యక్తి పేరు మీద రాయడానికి సిద్దం అయ్యాడు. తన తండ్రి ఆస్తులు మొత్తం వేరే మగాడి పేరుతో రాయడానికి సిద్దం అవుతున్నాడని తెలుసుకున్న కొడుకు తండ్రి మనసు మార్చడానికి ప్రయత్నించాడు. ఇదే సమయంలో ఊరి బయట చెరుకు తోటలో తండ్రి హత్యకు గురైనాడు. తన తండ్రిని ముగ్గురు వ్యక్తులు హత్య చేశారని కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రిని హత్య చేసిన వారి వివరాలను కూడా కొడుకు పోలీసులకు చెప్పాడు. పోలీసుల విచారణలో ఎవరు హత్య చేశారు ? అనే అసలు విషయం బయటకు కావడం కలకలం రేపింది.

తండ్రి కాలాంతకుడు
ఉత్తరప్రదేశ్ లోని ఖతౌలి ప్రాంతంలో రేష్ పాల్ అనే రైతు నివాసం ఉంటున్నాడు. రేష్ పాల్ కు పొలాలు, ఆస్తులు ఉన్నాయి. రేష్ పాల్ కుమారుడు సుమిత్ కుమార్ కూడా వ్యవసాయం చేస్తూ వ్యాపారం చేస్తున్నాడు. సుమిత్ కుమార్ తండ్రి రేష్ పాల్ కు వయసు పెరుగుతున్నా అతను మంచి రసికుడు అని ఆ ఊరిలో పేరు ఉంది.

భార్య, కొడుకును గాలికి వదిలేశాడు
భార్య, వయసు వచ్చిన కొడుకు సుమిత్ కుమార్ ను గాలికి వదిలేసిన రేష్ పాల్ అక్రమ సంబంధాలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. భార్యతో పాటు కొడుకు సుమిత్ కుమార్ కూడా నీ పద్దతి మార్చుకోవాలని రేష్ పాల్ కు పదేపదే బుద్దిమాటలు చెప్పారు. కుక్క తోక వంకర అంటూ రేష్ పాల్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా తయారైయ్యింది.

అక్రమ సంబంధంతో ఆస్తులు రాసివ్వాలని స్కెచ్
భార్య, కొడుకు సుమిత్ కుమార్ తో పాటు బంధువులతో సహ తెలిసిన వాళ్లు ఎంత చెప్పినా రేష్ పాల్ మాత్రం పద్దతి మార్చుకోలేదు. ఊర్లో అందరూ అయిపోవడంతో ఎర్రగా బుర్రగా ఉండే పక్క ఊరి వాళ్ల కోసం రేష్ పాల్ వెంపర్లాడాడని సమాచారం. ఇంట్లో భార్యను పట్టించుకోవడం వదిలేసిన రేష్ పాల్ నిత్యం పరాయి మహిళలతో ఎంజాయ్ చేశాడు. తన పేరుతో ఉన్న ఆస్తులు వేరే వ్యక్తి పేరు మీద రాయడానికి ఇటీవల రేష్ పాల్ సిద్దం అయ్యాడని అతని కొడుకు సుమీత్ కుమార్ కు తెలిసింది.

చెరుకు తోటలో శవమైన తండ్రి
తన తండ్రి రేష్ పాల్ అతని పేరుతో ఉన్న ఆస్తులు మొత్తం వేరే వ్యక్తి పేరుతో రాయడానికి సిద్దం అవుతున్నాడని తెలుసుకున్న కొడుకు సుమిత్ కుమార్ అతని తండ్రి మనసు మార్చడానికి కొంతకాలంగా ప్రయత్నించాడని తెలిసింది. ఇదే సమయంలో ఊరి బయట ఉన్న చెరుకు తోటలో రేష్ పాల్ హత్యకు గురైనాడు.

పేర్లతో సహ చెప్పిన కొడుకు
తన తండ్రి రేష్ పాల్ ని ముగ్గురు వ్యక్తులు హత్య చేశారని కొడుకు సుమిత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి రేష్ పాల్ ను ఎవరు హత్య చేశారు అని పేర్లతో సహ కొడుకు సుమిత్ కుమార్ పోలీసులకు చెప్పాడు. అయితే పోలీసుల విచారణలో రేష్ పాల్ హత్య చేశారు ? అనే విషయంలో కొత్త పేరు తెరమీదకు రావడం కలకలం రేపింది.

తండ్రిని చంపింది కొడుకే
పోలీసుల విచారణలో హత్యకు గురైన రేష్ పాల్ వ్యవహారం ఒక్కొక్కటి బయటకు వచ్చాయి, పరాయిస్త్రీలతో పాటు రేష్ పాల్ మరో వ్యక్తితో హోమోసెక్స్ కు అలవాటు పడ్డాడనని, పరాయి మగాడి మోజులో పడిపోయిన రేష్ పాల్ తన పేరుతో ఉన్న పొలాలు, ఆస్తులు హోమో సెక్స్ లో పాల్గొంటున్న వ్యక్తికి రాసివ్వడానికి సిద్దం అయ్యాడని కొడుకు పోలీసులకు చెప్పాడు.

కుటుంబం పరువు తీశాడు
కుటుంబ పరువు మొత్తం తీసేస్తున్నాడని కోపంతో నేను తన తండ్రి రేష్ పాల్ ను హత్య చేశానని అతని కొడుకు సుమిత్ కుమార్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. హోమ్ సెక్స్ కారణంగా తన తండ్రి విచ్చలవిడిగా తయారైనాడని నేను హత్య చేశానని సుమిత్ కుమార్ అంగీకరించడంతో అతన్ని అరెస్టు చేశామని ముజఫర్ నగర్ జిల్లా పోలీసులు స్థానిక మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications