జియో బంపర్ ఆఫర్: దీపావళి నుండి జియో ఫైబర్ , రూ.500లకే 100జీబీ
దీపావళి నుండి కొత్త ఆఫర్ కు రిలయన్స్ జియో ప్రారంభించనుంది. జియో ఫైబర్ పై బారీ క్రేజ్ నెలకొంది. రూ.500లకే బేసిక్ ప్లాన్ తో 100జీబీ డేటాను అందింనుంది జియో ఫైబర్.
ముంబై: దీపావళి నుండి కొత్త ఆఫర్ కు రిలయన్స్ జియో ప్రారంభించనుంది. జియో ఫైబర్ పై బారీ క్రేజ్ నెలకొంది. రూ.500లకే బేసిక్ ప్లాన్ తో 100జీబీ డేటాను అందింనుంది జియో ఫైబర్.
అన్ లిమిటెడ్ వాయిస్, డేటా కాల్స్ తో మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్ జియో మార్కెట్లో తన ప్రత్యర్ధులకు చుక్కలు చూపించింది. మరో వైపు టెలికం పరిశ్రమలో జియో వైఫై కూడ భారీగా అంచనాలు వస్తున్నాయి.
దీపావళి సీజన్ నాటికి జియో పైబర్ సేవలను ప్రారంభించనుంది. బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లలో జియో మీడియా షేర్ డివైస్ , స్మార్ట్ సెట్ టాప్ బాక్స్ , రౌటర్లు ఇతర పవర్ లైన్ కమ్యూనికేషన్ డివైస్ లతో తన సేవలను ప్రారంభించనుంది.
రూ.500 ప్లాన్లలో 600జీబీ డేటా సేవలు ప్రారంభంకానున్నాయి. 100 ఎంబిపిఎస్ వేగంతో 1000 జీబీ డేటాను అందించనుంది. దీనికిగాను చందాదారులకు ఒక నెలకు రూ.2వేలను చెల్లించాల్సి ఉంటుందని నివేదించింది.
మరో వైపు జియో ఎఫెక్ట్ తో బ్రాడ్ బ్యాండ్ సేవల్లో ఉన్న టెలికం మేజర్లు ఎయిర్ టెల్, బిఎస్ ఎన్ ఎల్ ప్రణాళికలను అప్ డేట్ చేస్తున్నాయి.
కాగా, ముంబాయి, ఢిల్లీ ఎన్సిఆర్ , అహ్మదాబాద్, జామ్ నగర్, సూరత్, వడోదరలను బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను ప్రారంభించనున్నట్టు ఇటీవల జియో పైబర్ అధికారికంగా ప్రకటించింది. జియో ఫైబర్ ఆఫర్ ద్వారా వినియోగదారులు మూడు నెలలు అధిక వేగవంతమైన ఇంటర్నెట్ ను అందించనున్నట్టు తెలిపింది. అలాగే ల్యాండ్ లైన్ సర్వీసులను త్వరలోనే ప్రారంభించనుంది.