శుభవార్త: 3 కోట్ల విద్యార్థులకు ఫ్రీ వైఫై ఇవ్వనున్న జియో
రిలయన్స్ జియో 38 వేల కళాశాలలకు ఉచిత వైఫై సేవలను అందించేందుకు సన్నద్దమౌతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి జియో ప్రతిపాదనలను పంపిందని సమాచారం.
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో 38 వేల కళాశాలలకు ఉచిత వైఫై సేవలను అందించేందుకు సన్నద్దమౌతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి జియో ప్రతిపాదనలను పంపిందని సమాచారం.
మార్కెట్లోకి రావడంతోనే సంచలనాలకు కేంద్రంగా మారింది జియో. అయితే ఆరు మాసాలు దాటినా తర్వాత కూడ సంచలనాలకు కారణమౌతూనే ఉంది.
శుభవార్త: ఆగష్టు 24 నుండి రిలయన్స్ ఫీచర్ఫోన్ బుకింగ్ , ఎలాగంటే?
తాజాగా రిలయన్స్ ఫీచర్ ఫోన్ను విడుదల చేయనున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ ఫోన్లో అనేక రకాల ఆఫ్షన్లు ఉంటాయని ఆ కంపెనీ ప్రకటించింది.
జియో దెబ్బ: 3 నెలలకు రూ.550 కోట్లు నష్టపోతోన్న ఎయిర్టెల్
అయితే ఈ ఫోన్ను సెప్టెంబర్ 1వ, తేది నుండి అందుబాటులోకి తీసుకువస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. అయితే ఈ ఏడాది ఆగస్టు 24 నుండి ఈ ఫోన్ కొనుగోలు కోసం బుకింగ్ ప్రారంభించనున్నట్టు రిలయన్స్ కంపెనీ ప్రకటించింది.
మూడు కోట్ల విద్యార్థులకు ఉచిత వైఫై
దేశంలోని 38 వేల కళాశాలలకు ఉచితంగా వైఫై సేవలను అందించేందుకుగాను జియో యోచిస్తోంది.ఈ మేరకు కేంద్రప్రభుత్వం వద్ద ప్రతిపాదనలను పంపింది. అయితే కేంద్రం ఈ ప్రతిపాదనలకు అంగీకరిస్తే జియో ఉచితంగా ఈ కాలేజీలకు వైఫైను ఇవ్వనుంది.
Recommended Video
38 వేల కళాశాలల్లో
దేశంలోని 38వేల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా వైఫై సేవలను అందించేందుకు జియో ప్రతిపాదనలను సిద్దం చేస్తోంది. ఈ మేరకు ఉచితంగా వైఫై సేవలను అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ మేరకు తమ కంపెనీ నుండి మాత్రం జియో కేంద్రానికి ప్రతిపాదనలను పంపింది.
జియోకే ప్రాజెక్టు
ఉచిత వైఫై సేవలను అందిస్తామని రిలయన్స్ జియో ప్రకటించింది. అయితే ఈ మేరకు కేంద్రానికి జియో పంపిన ప్రతిపాదనలు కూడ మానవవనరుల మంత్రిత్వశాఖకు అందాయి. అయితే ఉచితంగానే వైఫై సేవలను అందిస్తామని జియో ప్రకటించడంతో ఈ ప్రాజెక్టు ఆ కంపెనీకే దక్కే అవకాశాలున్నట్టు ప్రచారం సాగుతోంది . కానీ, ఈ విషయంలో కేంద్రం ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందో చూడాలి.
టెండర్ ప్రాసెస్ బట్టే అమలు
ఇతర కంపెనీలు కాకుండా కేవలం జియోకే ఈ ప్రాజెక్టును అప్పగించడం సరికాదనే అభిప్రాయాన్ని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే టెండర్ ప్రక్రియను అమలు చేయడం ద్వారానే దీన్ని అమలు చేస్తామన్నారు.టెండర్ విధానాన్ని అమలు చేస్తే అన్ని టెలికం కంపెనీలు ఈ ప్రక్రియలో పాల్గొంటాయి. అయితే టెండర్ పద్దతి నియమాల ప్రకారంగా ఏ కంపెనీ అర్హత సాధిస్తోందో ఆ కంపెనీకి టెండర్లు దక్కే అవకాశాలున్నాయి.