రిపబ్లిక్ డే ఉత్సవాలు: 6వ, వరుసలో రాహుల్కు సీటు, భగ్గుమన్న కాంగ్రెస్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే పరేడ్ వేడుకలకు హజరైన కాంగ్రెస్ చీఫ్ రాహుల్గాంధీకి ఆరవ వరుసలో సీటు కేటాయించడంపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది సంప్రదాయాలను పక్కన పెట్టి చవకబారు రాజకీయాలకు బిజెపి దిగుతోందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది.
రాహుల్ గాంధీకి ముందు వరుసలో సీటు కేటాయించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం చౌకబారు ఎత్తుగడలకు దిగిందని కాంగ్రెస్ పార్టీ మ్యూనికేషన్స్ ఇన్చార్జ్ రణ్దీప్ సూర్జీవాలా వ్యాఖ్యానించారు.
గతంలో ఏఐసీసీ అధినేత్రిగా సోనియా గాంధీ రిపబ్లిక డే పరేడ్లో ముందువరుసలో కూర్చునేవారని ఆ పార్టీ వర్గాలు గుర్తు చేశాయి. రాహుల్ను ఉద్దేశపూర్వకంగానే ఆరవ వరసలో కూర్చోపెట్టారని కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు.ప్రభుత్వ అభిమతమేదైనా తమకు మాత్రం రిపబ్లిక్ డే వేడుకలే ప్రధానమని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.
సూర్జీవాలా రిపబ్లిక్ డే వేడుకల్లో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పక్కన కూర్చున రాహుల్ ఫోటోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ముందువరుసలో మాజీ ప్రధానులు హెచ్డీ దేవెగౌడ, మన్మోహన్ సింగ్లు కూర్చున్నారు. కాగా, రిపబ్లిక్ డే వేడుకలకు తొలిసారిగా పది ఆసియాన్ దేశాధినేతలు హాజరయ్యారు.