Uttarakhand Tunnel Collapse: కొద్ది గంటల్లో 41 మందిని బయటకు తీసుకురానున్న ఎన్డీఆర్ఎఫ్..
సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతోన్నాయి. చిక్కుకున్న వారిని పైపుల ద్వారా తరలించాలని చూస్తున్నారు. గురువారం నుంచి ఎలాంటి పురోగతి లేదని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డిఎంఎ) శుక్రవారం తెలిపింది. సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను చేరుకోవడానికి ఇంకా 15 మీటర్లు కవర్ చేయాల్సి ఉందని పేర్కొంది. ఆగర్ మెషిన్ ద్వారా డ్రిల్లింగ్ త్వరలో ప్రారంభించే అవకాశం ఉందని NDMA తెలిపింది.
అంతకుముందు, సిల్క్యారా సొరంగంలోని శిధిలాల ద్వారా డ్రిల్లింగ్ కోసం ఉపయోగించిన ఆగర్ యంత్రానికి మద్దతు ఇచ్చే 25-టన్నుల ప్లాట్ఫారమ్ రిపెయిర్ వచ్చిందని సీనియర్ అధికారి శుక్రవారం ఉదయం తెలిపారు. కాగా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి శుక్రవారంతో 13వ రోజుకు చేరుకుంది. రాత్రికి రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని రెస్క్యూ ఆపరేషన్ ఇన్ఛార్జ్ కల్నల్ దీపక్ పాటిల్ తెలిపారు. ప్రతి పైపు వెల్డింగ్ దశకు సుమారు 1.5 నుండి 2 గంటల సమయం అవసరమని ఆయన అన్నారు.

#WATCH | | Uttarkashi (Uttarakhand) tunnel rescue: NDRF demonstrates the movement of wheeled stretchers through the pipeline, for the rescue of 41 workers trapped inside the Silkyara Tunnel once the horizontal pipe reaches the other side. pic.twitter.com/mQcvtmYjnk
— ANI (@ANI) November 24, 2023
ఇంకా కొన్ని గంటల్లో 41 మందిని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. వీరికి తక్షణమే వైద్య సహాయం అందించేందుకు ఘటన స్థలంలో అంబులెన్సులు, ప్రత్యేక పడకలు, ఔషధాలు, ఆక్సిజన్ కిట్లు అందుబాటులో ఉంచారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఆర్ఎఫ్) ఓ వీడియో విడుదల చేసింది .వెల్డింగ్ చేసిన పైపులో స్ట్రెచర్ మీద కార్మికులు వెల్లికిలా పడుకొని ఉంటే దానిని తాడుతో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు బయటకు లాగనున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications