పనిమనిషిపై రిటైర్డ్ ప్రొఫెసర్,అతని స్నేహితుడి గ్యాంగ్ రేప్... ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి...
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ పనిమనిషిపై రిటైర్డ్ ప్రొఫెసర్,సెక్యూరిటీ ఏజెన్సీ యజమాని గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ఆమె స్నానం చేస్తుండగా చిత్రీకరించిన వీడియోలను అడ్డుపెట్టుకుని గత కొన్నాళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. విషయం బయటకు పొక్కితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇన్నాళ్లు ఆమె నోరు మూయించారు. బాధితురాలు ఎట్టకేలకు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
పోలీసుల కథనం ప్రకారం... శివనారాయణ్ పాండే(60) అనే ఓ వ్యక్తి ఫాంహౌస్లో ఓ వివాహిత మహిళ(38) పనిచేస్తోంది. శివనారాయణ్ పాండే ఓ సెక్యూరిటీ ఏజెన్సీకి యజమాని. ఆ పనిమనిషి భర్త గతంలో శివనారాయణ్ నిర్వహిస్తున్న ఏజెన్సీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ఆమెపై కన్నేసిన శివనారాయణ్ ఓరోజు ఆమె బట్టలు మార్చుకుంటుండగా రహస్యంగా తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు.

అప్పటినుంచి ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇదే క్రమంలో గత ఆదివారం శివనారాయణ్ పాండే స్నేహితుడైన రిటైర్డ్ ప్రొఫెసర్ దేవేంద్ర పాండే అతని ఫాంహౌస్కి వచ్చాడు. ఆ సమయంలో శివనారాయణ్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడటం గమనించాడు. అప్పటి నుంచి అతనూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇలా శివనారాయణ్ పాండే,దేవేంద్ర పాండే ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నారు.
ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెను బెదిరించారు. ఇటీవల ఆమె తన భర్తకు అసలు విషయం చెప్పి... అతని సహాయంతో రతీబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఘటనపై ఎస్ఐ ప్రేక్ష మౌర్య మాట్లాడుతూ... సదరు రిటైర్డ్ ప్రొఫెసర్ను శివనారాయణ్ పాండే గొప్ప కవిగా ఆమెకు పరిచయం చేశాడని చెప్పారు. మొదట శివనారాయణ్ పాండే... ఆ తర్వాత దేవేంద్ర పాండే... బ్లాక్మెయిల్ చేసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పారు. కొన్నాళ్లుగా ఇద్దరూ కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నారని చెప్పారు. ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని... నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Recommended Video
గడిచిన నాలుగైదేళ్లలో మధ్యప్రదేశ్లో 26,708 రేప్ కేసులు,37 హత్యాచార కేసులు,27,827 మైనర్ బాలికల కిడ్నాప్ కేసులు,853 మహిళల కిడ్నాప్ కేసులు,2663 హత్య కేసులు నమోదైనట్లు క్రైమ్ డేటా చెబుతోంది. ఈ గణాంకాలను రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్వయంగా అసెంబ్లీలో వెల్లడించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications