ఐటీని వణికించిన సత్యం స్కాం: వెలుగు చూసిందిలా, కేసు ఇలా
హైదరాబాద్: ఐదేళ్ల క్రితం... దేశవ్యాప్తంగా సంచలనం రేపిన, ఐటీ సంస్థలకు వణుకు పుట్టించిన సత్యం కుంభకోణంలో రామలింగ రాజును, మరో తొమ్మిది మందిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా పేర్కొంటూ గురువారం నాడు తీర్పు చెప్పింది. భారత ఐటీ రంగంలో విప్లవంలా దూసుకు వచ్చిన రామలింగ రాజు ఇమేజ్ అంతే వేగంగా తగ్గిపోయింది. సత్యం కుంభకోణం ఆయన ప్రతిష్టను పాతాళానికి దిగజార్చింది.
సత్యం రామలింగ రాజు లేని లాభాలను ఉన్నట్టుగా చూపించారు. ఉద్యోగుల సంఖ్యను ఎవరికీ అనుమానం రాకుండా పెంచి వాటాదారులను కూడా మోసం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత... చివరకు తానే తప్పు అంగీకరించి షేర్ హోల్డర్లకు లేఖ రాశారు. అప్పటి వరకు సత్యం కుంభకోణం బయటకు రాలేదు.
2009 జనవరి 7వ తేదీన రామలింగ రాజు తప్పును అంగీకరిస్తూ షేర్ హోల్డర్లకు లేఖ రాశారు. ఏడువేల కోట్లకు పైగా అవతవకలు జరిగినట్లు అంగీకరిస్తూ లేఖ రాశారు. లేని లాభాలను ఉన్నవిగా చూపించానని, సంస్థ విలువను పెంచానని తెలిపారు.
దీంతో హైదరాబాదుకు చెందిన వాటాదారు లీలా మంగత్ ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసును సీబీఐకి అప్పగించారు. రామలింగ రాజు, ఆయన సోదరులు రామరాజు, వడ్లమాని శ్రీనివాస్ తదితరులను అరెస్టు చేసి జైలుకు పంపించారు.
రామలింగ రాజు రెండున్నర నుండి మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. అనంతరం జైలు నుండి విడుదలయ్యారు. ఆయన అనారోగ్యం పేరు చెప్పి జైలు నుండి బయటకు వచ్చారు. ఆరు నెలల క్రితం ఈ కేసు పైన వాదనలు పూర్తయ్యాయి. గురువారం నాడు సీబీఐ ప్రత్యేక కోర్టు అతనిని దోషిగా తేల్చింది. అతనికి జైలు శిక్షను ఈ రోజు లేదా రేపు ఖరారు చేయవచ్చునని అంటున్నారు.

జనవరి 7, 2009 - రూ.ఏడువేల కోట్ల ఫ్రాడ్ అయినట్లు చెప్పిన రామలింగ రాజు
జనవరి 8, 2009 - బ్యాంకులలోని 30 అకౌంట్లు ఫ్రీజ్ చేశారు.
జనవరి 9, 2009 - సత్యం సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నుండి తొలగించబడింది.
జనవరి 9, 2009 - సీఐడీ కేసు నమోదు చేసింది. అదే రోజు రామలింగ రాజు అరెస్ట్
జనవరి 10, 2009 - శ్రీనివాస్ వడ్లమూడి అరెస్ట్
జనవరి 11, 2009 - దీపక్ పరేఖ్, కిరణ్ కార్నిక్, అచుతన్లను ప్రభుత్వం సత్యం బోర్డు మెంబర్స్గా నియమించింది.
ఫిబ్రవరి 2009 - సీబీఐ కేసు నమోదు చేసి, అనంతరం మూడు ఛార్జీషీట్లు దాఖలు చేసింది.
ఏప్రిల్ 22, 2009 - సత్యం కంపెనీని టెక్ మహింద్రా టేకోవర్ చేసింది.
జూన్ 22, 2009 - మహీంద్రా సత్యం - మహింద్ర సత్యం న్యూ బ్రాండ్ విడుదల చేసింది.
నవంబర్ 2, 2011 - సుప్రీం కోర్టు సత్యం రామలింగ రాజుకు బెయిల్
అక్టోబర్ 28, 2013 - ఈడీ ఛార్జీషీట్ ఫైల్ చేసింది.
డిసెంబర్ 23, 2014 - సత్యం కేసు వాయిదా
మార్చి 9, 2015 - ఏప్రిల్ 9కి వాయిదా
ఏప్రిల్ 9, 2015 - రామలింగ రాజు సహా పది మందిని నిందుతులుగా తేల్చిన కోర్టు
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications