నిన్న మోడీ: బీజేపీ కొత్త ట్విస్ట్... రజనీకాంత్ను కల్సిన ఆర్కే నగర్ అభ్యర్థి
జయలలిత మృతి తర్వాత తమిళనాడులో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఆర్కే నగర్లో వివిధ పార్టీలో బరిలో నిలిచాయి. బీజేపీ కూడా గంగై అమరన్ను బరిలోకి దింపింది.
చెన్నై: జయలలిత మృతి తర్వాత తమిళనాడులో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఆర్కే నగర్లో వివిధ పార్టీలో బరిలో నిలిచాయి. బీజేపీ కూడా గంగై అమరన్ను బరిలోకి దింపింది.
గంగై అమరన్ మంగళవారం నాడు సూపర్ స్టార్ రజనీకాంత్ను కలిశారు. రజనీకాంత్ కోసం బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ రజనీకాంత్ను కలిశారు.

అప్పుడు ఆయనను బీజేపీలోకి రప్పించే ప్రయత్నాలు జరిగాయి. జయలలిత మృతి తర్వాత బీజేపీ రజనీకాంత్ను తమవైపు రప్పించుకునేందుకు మరిన్ని ప్రయత్నాలు చేసింది. కానీ అది కుదరలేదు.
ఇప్పుడు ఆర్కే నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీలతో పాటు దీపా జయ కుమార్, పన్నీరుసెల్వం వర్గం నేత తదితరులు చాలామంది బరిలో ఉన్నారు.
ఇప్పుడు బీజేపీ ఆర్కే నగర్ అభ్యర్థి గంగై అమరన్ రజనీకాంత్ను కలిశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఆయన కలిసినట్లుగా కనిపిస్తోంది. రజనీకాంత్ ఇంటికి వెళ్లి కలిసిన అనంతరం గంగై అమరన్ మీడియాతో మాట్లాడారు. తనకు రజనీకాంత్ మద్దతు ఉందని ప్రకటించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications