వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్యూరిటీ గార్డుపై దాడి: ఏటిఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లారు!

|
Google Oneindia TeluguNews

మోగా: నిన్న మొన్నటి వరకు ఏటిఎంలలో డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇప్పుడు ఏకంగా ఏటిఎం యంత్రాలనే ఎత్తుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. పంజాబ్ రాష్ట్రంలోని మోగా-ఫిరోజపూర్ రోడ్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వరంగ బ్యాంక్ ఏటిఎం కేంద్రంలోని ఏటిఎం యంత్రాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బుధవారం జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది.

ఏటిఎం సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన ఆరుగురు దుండుగులు, అతని కళ్లల్లో ఏదో రసాయనాన్ని చల్లారు. దీంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. గ్యాస్ కట్టర్లు ఉపయోగించిన దొంగలు ఆ ఏటిఎం యంత్రాన్ని బయటికి తరలించారు. ఓ నాలుగు చక్రాల వాహనంలో ఆ ఏటిఎంను ఎత్తుకెళ్లారు.

Robbers take away ATM with over Rs 1 lakh

దొంగతనానికి గురైన ఆ ఏటిఎం యంత్రంలో రూ. 1,70,600 ఉన్నాయని బ్యాంకు అధికారులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, రసాయనం కళ్లల్లో కొట్టడంతో ఆ ఏటిఎం సెక్యూరిటీ గార్డు కళ్లు పాక్షికంగా కనబడటం లేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు.

English summary
Six persons on Wednesday took away an ATM of a public sector bank installed on the premises of a private college on Moga-Ferozepur road here, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X