అప్పటి వరకు రోహింగ్యాలను పంపొద్దు: సుప్రీం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: రోహింగ్యా ముస్లిం శరణార్థుల విషయం సున్నితమైన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తమను దేశం నుంచి పంపించ వద్దని వేసిన పిటిషన్ను శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసు విషయంలో దేశ భద్రతను రెండో ప్రాధాన్యత కింద తీసుకోలేమని.. అదే విధంగా రోహింగ్యాల మానవ హక్కులను దృష్టిలో ఉంచుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. రోహింగ్యాల విషయంలో రాష్ట్రాలది కీలక పాత్రని కోర్టు వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణను నవంబరు 21కి వాయిదా వేసింది.

అప్పటి వరకు రోహింగ్యాలను దేశం నుంచి పంపించే ప్రయత్నాలు చేయొద్దని అధికారులకు సూచించింది. రోహింగ్యాల తరలింపు విషయంలో కేంద్రం ఏమైనా ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటే.. వాటిని తప్పకుండా న్యాయస్థానానికి తెలియజేయాల్సిందిగా కోరింది.
రోహింగ్యాలు దేశ భద్రతకు ముప్పు అని, శరణార్థుల్లో కొంతమందికి ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని కేంద్రం ఆరోపించిన విషయం తెలిసిందే. అందుకే వాళ్లని దేశం నుంచి పంపించి వేస్తున్నట్లు కేంద్రం గతంలో న్యాయస్థానానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే రోహింగ్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications