అప్పటి వరకు రోహింగ్యాలను పంపొద్దు: సుప్రీం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: రోహింగ్యా ముస్లిం శరణార్థుల విషయం సున్నితమైన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తమను దేశం నుంచి పంపించ వద్దని వేసిన పిటిషన్ను శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసు విషయంలో దేశ భద్రతను రెండో ప్రాధాన్యత కింద తీసుకోలేమని.. అదే విధంగా రోహింగ్యాల మానవ హక్కులను దృష్టిలో ఉంచుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. రోహింగ్యాల విషయంలో రాష్ట్రాలది కీలక పాత్రని కోర్టు వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణను నవంబరు 21కి వాయిదా వేసింది.

అప్పటి వరకు రోహింగ్యాలను దేశం నుంచి పంపించే ప్రయత్నాలు చేయొద్దని అధికారులకు సూచించింది. రోహింగ్యాల తరలింపు విషయంలో కేంద్రం ఏమైనా ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటే.. వాటిని తప్పకుండా న్యాయస్థానానికి తెలియజేయాల్సిందిగా కోరింది.
రోహింగ్యాలు దేశ భద్రతకు ముప్పు అని, శరణార్థుల్లో కొంతమందికి ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని కేంద్రం ఆరోపించిన విషయం తెలిసిందే. అందుకే వాళ్లని దేశం నుంచి పంపించి వేస్తున్నట్లు కేంద్రం గతంలో న్యాయస్థానానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే రోహింగ్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే'












Click it and Unblock the Notifications