నడి రోడ్డులో రూ. 58 లక్షలు లూటీ: దర్జాగా పరార్
థానే: నడి రోడ్డు మీద అందరూ చూస్తున్న సమయంలో మారణాయుధాలతో బెదిరించి రూ. 58 లక్షలు లూటీ చేసిన సంఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. నగదు లూటీ చేసిన దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలించినా చేసినా ఫలితం లేకుండా పోయింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం మద్యాహ్నాం థానే జిల్లాలోని బాంబి వ్యాలీలో ర్యాలీ నిర్వహించారు. తరువాత థానే మీదుగానే ఆయన ప్రయాణించారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు థానే నగరంలోని వివిధ రైల్వే స్టేషన్లలో టిక్కెట్లు విక్రయించగా వచ్చిన నగదు సేకరించారు.

తరువాత రైల్వే సిబ్బంది సెక్యూరిటి గార్డుతో పాటు నగదు తీసుకుని వ్యాన్ లో బయలుదేరారు. మార్గం మధ్యలో కల్యాణ్-షిల్ రహదారిలోని నిల్జీ రైల్వే స్టేషన్ సమీపంలో 7 మంది దుండగులు వ్యాన్ ను అడ్డగించారు. మారణాయుధాలతో వ్యాన్ లో ఉన్న వారిని బెదిరించారు.
అందరూ చూస్తున్నా లెక్కచెయ్యని దుండగులు క్షణాలలో వ్యాన్ లో ఉన్న రూ. 58 లక్షలు లూటీ చేసి తాము వచ్చిన తెలుపు రంగు కారులో అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు నాకాబందీ కొనసాగించినా ఫలితం లేదు.
అయితే దుండగులు వచ్చిన తెలుపు రంగు కారు మాత్రం ఊరి చివరిలో వదిలి పెట్టి వెళ్లారని, దానిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ పరాగ్ మనీరే తెలిపారు. అయితే ఆ కారు చోరీ చేసి ఉంటారని థానే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications