దారుణం: రష్యన్ యువతిపై యాసిడ్ దాడి
వారణాసి: ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో శుక్రవారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వారణాసిలోని కరౌండి ప్రాంతంలో నివసిస్తున్న రష్యా జాతీయురాలైన ఓ 23 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉండగా, ఉదయం 4 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమెపై యాసిడ్ దాడి చేసి పరారయ్యాడు.
స్థానికులు యువతిని ఆస్పత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తి యువతికి బాగా తెలిసిన వాడై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వారణాసి ఎస్ఎస్పీ తెలిపారు.

వృద్ధ దంపతుల హత్య
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని కైలాష్ ప్రాంతంలో దారుణం జరిగింది. ఇద్దరు వృద్ధ దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. అయితే దంపతులు నివసిస్తున్న ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
దోపిడీకి వచ్చిన దుండగులు దంపతులను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులను మనోహర్ లాల్ మదన్(84), విమల(80)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications