దారుణం: రష్యన్ యువతిపై యాసిడ్ దాడి
వారణాసి: ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో శుక్రవారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వారణాసిలోని కరౌండి ప్రాంతంలో నివసిస్తున్న రష్యా జాతీయురాలైన ఓ 23 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉండగా, ఉదయం 4 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమెపై యాసిడ్ దాడి చేసి పరారయ్యాడు.
స్థానికులు యువతిని ఆస్పత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తి యువతికి బాగా తెలిసిన వాడై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వారణాసి ఎస్ఎస్పీ తెలిపారు.

వృద్ధ దంపతుల హత్య
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని కైలాష్ ప్రాంతంలో దారుణం జరిగింది. ఇద్దరు వృద్ధ దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. అయితే దంపతులు నివసిస్తున్న ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
దోపిడీకి వచ్చిన దుండగులు దంపతులను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులను మనోహర్ లాల్ మదన్(84), విమల(80)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications