బోల్తా పడ్డ అయ్యప్ప స్వాముల బస్సు..: ఇతర రాష్ట్రాల డ్రైవర్లకు కేరళ పోలీసుల సూచనలు
Sabarimala: కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజూ వేలాదిమంది దర్శించుకుంటోన్నారు. డిసెంబర్ 26వ తేదీన మండలం పూజలు ముగియనున్నాయి. మకరవిళక్కు కోసం మళ్లీ 30వ తేదీన స్వామివారి ఆలయాన్ని తెరుస్తారు. ఈ 16వ తేదీన మండలం పూజల కోసం అయ్యప్ప స్వామివారి ఆలయం తెరచుకుంది. తొలి వారంలోనే అయ్యప్ప స్వామిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 14 లక్షలు దాటింది.
భక్తులు వేల సంఖ్యలో తరలి వెళ్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇటీవలే కర్ణాటకలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప స్వాములు మరణించారు. వారిని చెన్నైకి చెందిన గోపీ, గౌతమ్ రమేష్, హరిహరన్, జయంకర్ గా గుర్తించారు. కర్ణాటక కోలార్ జిల్లాలోని మాలూరు తాలూకా అబ్బేనహళ్లి సమీపంలో బెంగళూరు-చెన్నై ఎక్స్ప్రెస్ హైవేపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

ఇప్పుడు తాజాగా తమిళనాడుకే చెందిన అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తోన్న ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. కొల్లం-తేని జాతీయ రహదారిపై ఇడుక్కి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 50 మంది అయ్యప్ప భక్తులు గాయపడ్డారు. వారిలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, రెస్క్యూ సర్వీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.
50 మంది అయ్యప్ప స్వాములతో తమిళనాడులోని దిండిగల్ నుండి శబరిమలకు బయలుదేరి వెళ్లిన బస్సు అది. తెల్లవారు జామున 5:45 నిమిషాల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఇడుక్కి జిల్లాలోని కొట్టక్కాణం సమీపంలో మలుపులో బోల్తా పడింది. డ్రైవర్ బస్సును అదుపు చేయడంలో విఫలం కావడం వల్లే ప్రమాదానికి కారణమని పీర్మేడ్ స్టేషన్ పోలీసులు తెలిపారు.
సమాచారం అందిన వెంటనే వారు అగ్నిమాపక సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులను రక్షించారు. క్షతగాత్రులను కొట్టాయం జిల్లాలోని ముండకాయంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సు డ్రైవర్లు కేరళ ఘాట్ రోడ్లల్లో జాగ్రత్తగా వాహనాలను నడిపించాలని, అతివేగం కారణంగా జాతీయ రహదారిలో మలుపులను సరిగా అంచనా వేయలేకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications