సచిన్ దత్తత తీసుకున్న గ్రామం ఆంధ్రాలో ఎక్కడ
న్యూఢిల్లీ: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఓ గ్రామాన్ని దత్తతు తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్న ఆ గ్రామం పేరు పుత్తరాజుకండ్రిక. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా సవాల్ను స్వీకరించిన సచిన్ ఈ గ్రామాన్ని 'సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోచన' క్రింద ఈ గ్రామాన్ని దత్తతు తీసుకున్నట్లు తెలిపారు.
ఈ గ్రామాన్ని రూ. 3.50 కోట్ల నిధులతో అభివృద్ది చేయనున్నట్లు సచిన్ ప్రకటించారు. ఈ గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సమకూర్చనున్నారు.
నవంబర్ 16వ తేదీన సచిన్ టెండూల్కర్ ఈ గ్రామాన్ని సందర్శించి అభివృద్ది పనులను సమీక్షిస్తారు. పుత్తరాజుకండ్రిక గ్రామంలో 24 గంటలపాటు అందుబాటులో తాగునీరు, వీధిలైట్లు, రోడ్లు, డ్రైనేజీ, చెత్తనిర్మూలన వ్యవస్థ, శ్మశానం, సెల్ఫోన్ టవర్లు, వైఫై జోన్, బ్యాంకు, ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాలను నిర్మిస్తారు.
తాను తీసుకున్న నిర్ణయం గురించి ప్రధాని నరేంద్రమోడీని గురువారం సతీసమేతంగా కలిసి సచిన్ టెండూల్కర్ వివరించారు. ప్రధాని మోడీ... సచిన్ను అభినందించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ను మరింత విస్తరించాలని సచిన్ టెండూల్కర్ నరేంద్రమోడీని కోరారు.