ఎంపీలాడ్స్ నుండి ఒక్క పైసా ఖర్చు చేయని సచిన్, రేఖ
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, బాలీవుడ్ అలనాటి అందాల నటి రేఖలు రెండేళ్లుగా తమ ఎంపీ నిధులను మురుగ పెడుతున్నారట. సచిన్, రేఖలు రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్లుగా వారు అభివృద్ధి కోసం పైసా ఖర్చు పెట్టలేదు.
వారు అడాప్ట్ చేసుకున్న ప్రాంతాలకు వారు ఇంత వరకు ఏమీ ఖర్చు చేయలేదు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అధికారిక వెబ్సైట్లో ఖర్చు చేయని ఎంపీల వివరాలను ఉంచారు.

రాజ్యసభ సభ్యులు ఏదైనా ఓ జిల్లా బాధ్యతను తీసుకునే అవకాశముంది. ప్రతి రాజ్యసభ సభ్యుడికి సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వం అభివృద్ధి నిమిత్తం ఎంపీ లాడ్స్ నుండి కేటాయిస్తుంది. సచిన్, రేఖలకు రెండేళ్లలో ఎంపీ లాడ్స్ కింద పదికోట్ల రూపాయలు ఉన్నాయి.
అయితే, వారు మాత్రం ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. అయితే, సచిన్ టెండుల్కర్ ఇటీవలె ముంబై సబర్బన్ జిల్లా బాధ్యతను తీసుకున్నారు. రేఖ మాత్రం ఇంకా తీసుకోలేదు. వీటిపై విమర్శలు వినిపిస్తున్నాయి.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications