క్లాస్12లో సిక్కు గురువుల చాప్టర్లు తొలగింపు:కాంగ్రెస్పై విమర్శలు, అమరీందర్ స్పందన
చండీగఢ్: పంజాబ్ స్కూల్ ఆఫ్ ఎడ్యూకేషన్ బోర్డు (పీఎస్ఈబీ) క్లాస్ 12 హిస్టరీ పుస్తకం నుంచి సిక్కుల గురువులకు సంబంధించిన 23 చాప్టర్లను తొలగించారని ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్ పార్టీలు.. అమరీందర్ సింగ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగాయి.
మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ, అకాలీ దళ్ పార్టీలు ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. సిక్కుల చరిత్రను తక్కువ చేసే ప్రసక్తి ఉండదన్నారు.

క్లాస్ 12లో 23 చాప్టర్లు తొలగించారన్న వారి వ్యాఖ్యలను ప్రభుత్వం ఖండించింది. ఆ చాప్టర్లను క్లాస్ 12 నుంచి తొలగించి, వాటిని క్లాస్ 11 హిస్టరీ పుస్తకాల్లో ప్రవేశ పెడుతున్నామని, ఇంకా ఆ పుస్తకాలు ముద్రితం కావాల్సి ఉందన్నారు.












Click it and Unblock the Notifications