ఖర్చులను తగ్గించుకోవడానికే టెక్కీలపై వేటు: ఇన్సోసిస్ నారాయణమూర్తి
తమ ఖర్చులను తగ్గించుకొనే వ్యూహంలో భాగంగా ఉద్యోగులపై వేటు వేయడంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు ఇన్పోసిస్ పౌండర్ చైర్మెన్ నారాయణమూర్తి.
బెంగుళూరు: తమ ఖర్చులను తగ్గించుకొనే వ్యూహంలో భాగంగా ఉద్యోగులపై వేటు వేయడంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు ఇన్పోసిస్ పౌండర్ చైర్మెన్ నారాయణమూర్తి.
ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాల కోతపై శుక్రవారంనాడు ఆయన స్పందించారు. ఉద్యోగులను తొలగించడం విచారకరమన్నారు. అయితే అంతకుమించి ఆయన తన అభిప్రాయాలను వివరించలేదు.

ఆటో మెషన్, ట్రంప్ కొత్త హెచ్ 1 బీ వీసా కొత్త నిబంధనల నేపథ్యంలో ఐటీ రంగం సంక్షోభంలో చిక్కుకొంది. ఉద్యోగులను తొలగించనున్నట్టు ఇన్పోసిస్ ప్రకటించిది. వందలాది మంది మధ్యస్థ, సీనియర్ ఉద్యోగలుకు పింక్ స్లిప్ అందిస్తున్నట్టు ఇన్పోసిస్ ప్రకటించింది.
ఇదే బాటలో విప్రో కూడ పయనించింది. తన వార్షిక పనితీరు అంచనాలో భాగంగా 600 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు వెల్లడించింది. అయితే కాగ్నిజెంట్ మాత్రం ఉద్యోగుల తొలగింపు వార్తలను ఖండిచింది.












Click it and Unblock the Notifications