Sadist: వదినతో వన్స్ మోర్, ఆమెతో పెళ్లి, బెడ్ రూమ్ వద్దు, డైనింగ్ టేబుల్ మీద?, నో అంటే కాల్చేశాడు!
లక్నో/ ముజఫర్ నగర్/ చెన్నై: సొంత అన్న భార్యతో అక్రమ సంబంధం పెట్టున్న తమ్ముడు వదినతో కొన్ని సంవత్సరాలు పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. మరిదికి కామం ఎక్కువ కావడంతో వదిన కూడా జల్సా చేసింది. అన్న చనిపోయిన తరువాత వేరే పెళ్లాం ఎందుకు అంటూ వదిననే అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. మొబైల్ లో పోర్న్ వీడియోలు చూస్తూ వెరైటీ వెరైటీ సెక్స్ కోరికలు పెంచుకున్న భర్త తన భార్యతో వెరైటీగా కామం కోరికలు తీర్చుకోవాలని చెప్పాడు. బెడ్ రూమ్ రొమాన్స్ బోరుకొట్టిందని, డైనింగ్ టేబుల్ మీద ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందని భర్త చెప్పాడు.
డైనింగ్ టేబుల్ మీద సెక్స్ లో పాల్గొనడానికి భార్య నిరాకరించింది. 15 రోజుల నుంచి డైనింగ్ టేబుల్ మీద కోరిక తీర్చాలని భర్త అతని భార్యకు టార్చర్ పెట్టాడు. ఎంతకు భార్య లొంగకపోవడంతో చివరికి భర్త రివాల్వర్ తీసుకుని భార్యను అదే డైనింగ్ టేబుల్ మీద పెట్టి దారుణంగా కాల్చి చంపేశాడు. భార్యను చంపేసిన భర్త ముగ్గురు పిల్లలను తీసుకెళ్లి గంగా నది కెనాల్ లో విసిరేయడం కలకలం రేపింది.

సొంత అన్న భార్యతో రొమాన్స్
ఉత్దరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ సమీపంలోని బసేడి గ్రామంలో పప్పు (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పప్పు అన్నకు డోలి (28) అనే యువతితో 10 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. అన్న భార్య డోలీ మీద కోరికలు పెంచుకున్న పప్పు ఆమెను లొంగదీసుకుని చాలా సంవత్సరాలు ఎంజాయ్ చేశాడు. మరిది పప్పుకు కామ కోరికలు బలంగా ఉండటంతో డోలీ కూడా మరిదితో సరసాలకు ఏరోజూ అడ్డు చెప్పకుండా సై అని చెప్పింది.

నిన్న వదిన..... నేడు భార్య
పప్పు సోదరుడు అనారోగ్యంతో మరణించాడు. ఇంతకాలం పడక సుఖం ఇచ్చిన వదిన డోలీ పక్కనే ఉందని, తనకు ఇంకో పెళ్లాం ఎందుకు అని ఆలోచించిన పప్పు సొంత అన్న భార్య డోలీని రెండో పెళ్లి చేసుకున్నాడు. డోలీకి అప్పటికే సానియా (5), వన్షా (3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వదిన డోలీని పెళ్లి చేసుకున్న పప్పు ఆమెతో కాపురం చేసి 18 నెలల పాపకు తండ్రి అయ్యాడు.

భర్తకు బెడ్ రూమ్ రోమాన్స్ బోరు కొట్టింది
పప్పుకు పోర్న్ వీడియోలు విపరీతంగా చూసే పిచ్చి ఉందని సమాచారం. పోర్న్ స్టార్ వివిద భంగిమల్లో సెక్స్ చేస్తున్న వీడియోలు చూసిన పప్పుకు తాను అలాగే ఎంజాయ్ చెయ్యాలని కోరికలు పెంచుకున్నాడు. రోజూ బెడ్ రూమ్ లో చేసే సెక్స్ మీద పప్పుకు విరక్తి పెరిగిందని, రూట్ మార్చాలని అతను ఆలోచించాడని సమాచారం.

డైనింగ్ టేబుల్ మీద నో చెప్పిన భార్య
బెడ్ రూమ్ లో రొమాన్స్ వద్దని, పిల్లలను బయటకు పంపించి డైనింగ్ టేబుల్ మీద కోరికలు తీర్చుకుందామని భర్త పప్పు అతని భార్య డోలీకి చెప్పాడు. డైనింగ్ టేబుల్ మీద సెక్స్ లో పాల్లొనడానికి డోలీ నిరకరించింది. ఇదే విషయంలో కొన్ని రోజుల నుంచి పప్పు, అతని భార్య డోలీకి గొడవలు జరుగుతున్నాయని వెలుగు చూసింది.

కోరిక తీర్చని భార్య..... కాల్చి పారేసిన భర్త
డైనింగ్ టేబుల్ మీద సెక్స్ లో పాల్గొనడానికి నిరాకరించిన భార్య డోలీ మీద పప్పు రగిలిపోయాడు. నేను చెప్పిన మాట వినకుంటే నిన్ను చంపేస్తానని పప్పు అతని భార్య డోలీని హెచ్చరించాడు. నువ్వు నన్ను చంపినా సరే నేను మాత్రం డైనింగ్ లేబుల్ మీద మరోసారి నీతో పడుకోనని డోలీ తేల్చి చెప్పింది. సహనం కోల్పోయిన భర్త పప్పు రివాల్వర్ తీసుకుని భార్య డోలీని డైనింగ్ టేబుల్ మీద పడుకోబెట్టి ఆమె తల మీద రివాల్వర్ తో కాల్చి చంపేశాడు.

ముగ్గురు పిల్లలను నదిలో విసిరేసిన కిరాతకుడు
భార్య డోలీని హత్య చేసిన తరువాత ముగ్గురు పిల్లలు అనాథలు అవుతారని పప్పు ఆందోళన చెందాడు. అంతే ముగ్గురు పిల్లలను పిలుచుకుని గ్రామం సమీపంలోని గంగా నది కెనాల్ లో విసిరేసి పరారైనాడు. డోలి హత్య గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు గాలించి 24 గంటల్లోనే నిందితుడు పప్పును అరెస్టు చేశారు.

15 రోజుల నుంచి కోరిక తీర్చలేదని కసి
విచారణలో పప్పు చెప్పిన వివరాలు తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. తనకు డైనింగ్ టేబుల్ మీద కోరిక తీర్చాలని తన భార్యకు చాలాసార్లు చెప్పినా ఆమె నామాట వినలేదని, తనకు 15 రోజుల నుంచి పడక సుఖం లేదని, అందుకే కాల్చి చంపేశానని పప్పు విచారణలో అంగీకరించాడని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది.
Recommended Video

వీడు శాడిస్టులకే కేరాఫ్ అడ్రెస్
గంగా నది కెనాల్ లో ముగ్గురు పిల్లల ఆచూకి మాత్రం చిక్కడం లేదని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు అంటున్నారు. వదిన మీద వ్యామోహంతో ఆమెనే రెండో పెళ్లి చేసుకున్న భర్త చివరికి డైనింగ్ టేబుల్ మీద కోరిక తీర్చలేదనే చిన్న విషయానికి రివాల్వర్ తో కాల్చి హత్య చెయ్యడం కలకలం రేపింది. పప్పు శాడిస్టులకే కేరాఫ్ అడ్రెస్ గా నిలిచాడని స్థానికులు అంటున్నారు.












Click it and Unblock the Notifications