పోలీస్ స్టేషన్ ముందు తల్లికి నిప్పంటించి వీడియో తీసిన శాడిస్టు కొడుకు, మ్యాటర్ మాత్రం ?
ఆ ఇంట్లో ప్రతి రోజూ ఆస్తి కోసం తల్లీ కొడుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తల్లీ కొడుకులు పోలీస్ స్టేషన్కు వచ్చారు. కొంతసేపటికి తల్లీకొడుకులు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. తరువాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తల్లి ఆమె మీద పెట్రోల్ పోసుకుని కొడుకును బెదిరించడానికి ప్రయత్నించింది తరువాత కొడుకు ఆమె తల్లికి నిప్పంటించాడు. ఆ తర్వాత తల్లి కాలిపోతుంటే కొడుకు వీడియో తీసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో చోటుచేసుకుంది.
ఆస్తి కోసం తల్లీ కొడుకుల మధ్య గొడవ మొదలైంది. ఈ విషయంలో కుటుంబీకులు జోక్యం చేసుకున్నప్పటికీ, కొడుకు ఆస్తి కోసం పట్టుబట్టాడు. ఉన్న ఇంటిని కొడుకు పేరు మీద రాస్తే బతకలేనని తెలిసి కొడుక్కి ఆస్తి ఇచ్చేందుకు తల్లి నిరాకరించింది. దీంతో తల్లీకొడుకుల పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తల్లి ఆమె కొడుకు మీద ఫిర్యాదు చెయ్యడంతో కేసు దాఖలైంది.

పోలీసులకు చెబుతానని కొడుకు అతని తల్లిని బెదిరించే ప్రయత్నం చేశాడు. కానీ శాడిస్టు కొడుకు శరీరం మీద పెట్రోల్ పోసుకుని బెదిరిస్తున్న అతని తల్లికి నిప్పంటించాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్ది క్షణాల్లో మంటలు చెలరేగాయి. పోలీసులు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాలు కొన్ని నిమిషాల పాటు ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

స్టేషన్లోని సెల్ లో ఉన్న బెడ్షీట్ను తీసుకొచ్చిన పోలీసులు మంటలను ఆర్పారు.అయితే అంతలోనే తల్లి శరీరం చాలా వరకు కాలిపోయింది. తల్లికి మంటలు వ్యాపిస్తున్న సమయంలో ఆమె కొడుకు మొబైల్ లో వీడియో రికార్డ్ చేశాడు. వెంటనే ఆ మహిళను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆ మహిళ శరీరం 40 శాతం కాలిపోయిందని, కన్న కొడుకు అతని తల్లికి నిప్పంటించిన సమయంలో పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డు అయ్యిందని, ఆ ఫుటేజీలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications