ఆడేసుకుంటున్నారు, ఎవరీ దయ అవసరం లేదు: బయటికొచ్చిన మాల్యా
భారత్లో ప్రధాన పార్టీలు తనను ఫుట్బాల్లా ఆడుకుంటున్నాయని బ్యాంక్లకు రూ.9,000 కోట్లు ఎగ్గొట్టిన కేసులో నిందితుడైన లిక్కర్ టైకూన్ విజయ్మాల్యా అన్నారు.
లండన్: భారత్లో ప్రధాన పార్టీలు తనను ఫుట్బాల్లా ఆడుకుంటున్నాయని
మనదేశంలోని బ్యాంక్లకు రూ.9,000 కోట్లు ఎగ్గొట్టిన కేసులో నిందితుడైన లిక్కర్ టైకూన్ విజయ్మాల్యా అన్నారు. ఈ విషయం ఇటీవల ఎన్నికల్లో పార్టీ నేతల ప్రసంగాల్లో తేటతెల్లమైందని తెలిపారు.
వారు ఆధారాలతో రానివ్వండి.. అసలు వాళ్ల దగ్గర ఆధారాలు ఉంటే చట్టం ఎప్పుడో తనపని తాను చేసుకుపోయేదని అన్నారు. యూకే చట్టాల కింద సురక్షితంగా ఉన్నానన్నారు.

భారతప్రభుత్వంలో ఎవరో దయతో బతికే కంటే ఇది సురక్షితమని మాల్యా తెలిపారు. కాగా, భారత అధికారులు.. యూకే అధికారులతో మాల్యా అప్పగింతపై చర్చలు జరిపిన రెండు రోజుల తర్వాత ఆయన ఇలా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
బయటి ఈవెంట్లో విజయ్ మాల్యా

విజయ్ మాల్యా ఫార్ములా వన్ కారు రేసింగ్ బృందం సహారా ఫోర్స్ కొత్త కారు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిల్వర్స్టోన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన డ్రైవర్లు పెరీజ్, ఈస్ట్బన్తో కలిసి ఫొటోలు దిగారు. వీటిన ఫార్ములా వన్.కామ్లో అప్లోడ్ చేశారు. మన దేశం నుంచి పారిపోయిన తర్వాత లండన్లోనే అజ్ఞాతంలో ఉంటున్న విజయ్ మాల్యా.. తొలిసారి ఇలా బయట జరిగిన కార్యక్రమంలో దర్శనమివ్వడం గమనార్హం.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications