అఖిలేష్ పాలన బాగుంది కాని, ఆయన మాస్ లీడర్ కాదు : అమర్ సింగ్
కోల్ కత్తా: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖలేష్ యాదవ్ పాలన బాగుందని సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు అమర్ సింగ్ చెప్పారు.ఆయన పాలన బాగుందంటూనే చురకలంటించారు. ఆయన మాస్ లీడర్ మాత్రం కాదన్నారు అమర్ సింగ్. అఖిలేష్ మాస్ లీడర్ గా ఎదిగేందుకు ఇంకా సమయం పట్టనుందన్నారు.
సమాజ్ వాదీ పార్టీలో అమర్ సింగ్ రీ ఎంట్రీ కారణంగానే ముసలం పుట్టినట్టు అఖిలేష్ యాదవ్ వర్గం ఆరోపిస్తోంది. అమర్ సింగ్ చేరికను ఆయన వ్యతిరేకించారు.అయితే ములాయం మాత్రం అమర్ సింగ్ ను పార్టీలో చేర్చుకొన్నారు.కొంతకాలంగా సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభం నెలకొంది.సోమవారం నాడు జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం తర్వాత పార్టీలోని రెండు వర్గాలు కొంత రాజీ పడినట్టు కన్పించాయి.

ఈ పరిణామాల తర్వాత సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అమర్ సింగ్ కోల్ కత్తాలో మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు.అఖిలేష్ పాలన బ్రహ్మండంగా ఉందన్నారు. రాష్ట్రాభివృద్దిపైన అఖిలేష్ కేంద్రీకరించి పనిచేస్తున్నారని అమర్ సింగ్ కితాబునిచ్చారు. కాని, ఆయన మాస్ లీడర్ మాత్రం కాదన్నారు. మాస్ లీడర్ గా ఎదగడానికి అఖిలేష్ కు సమయం పట్టనుందన్నారు.












Click it and Unblock the Notifications