వేడుకలో బార్ గర్ల్స్తో చిందేసిన ముజఫర్నగర్ ఎమ్మెల్యే
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ శాసన సభ్యుడు ఓ పెళ్లి వేడుకలో బార్ గర్ల్స్తో కలిసి చిందులు వేశారు. రాష్ట్రంలోని ముజఫర్ నగర్ ఎమ్మెల్యే చిత్తరంజన్ స్వరూప్ ఇటీవల ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అక్కడ జరిగిన కార్యక్రమాల్లో భాగంగా బార్ గర్ల్స్తో డ్యాన్స్ చేశాడు.
వెంటనే వేదిక పైకి ఎక్కి వారితో కలిసి అసభ్యకర రీతిలో నృత్యం చేయడమే గాకుండా, వారిపైకి కరెన్సీ నోట్లను విసిరారు. ఆ వేడుకకు హాజరైన పలువురు సమాజ్వాది పార్టీ శాసన సభ్యులు చూస్తూ ఆనందించారు. ఇటీవలే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ముజఫర్ నగర్ అల్లర్లు, సైఫాయి ఉత్సవంపై విమర్శలు ఎదుర్కొంది.
ఇప్పుడు ఈ ఘటన ముఖ్యమంత్రి అఖిలేష్ కుమార్ యాదవ్కు చిక్కులు తెచ్చి పెట్టనుందంటున్నారు. మత ఘర్షణల కారణంగా ముజఫర్ నగర్ జిల్లాలో కోల్పోయిన ప్రతిష్ఠను తిరిగి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న సమాజ్వాదీ పార్టీ అధినాయకత్వం చిత్తరంజన్ చిందులను సీరియస్గా తీసుకునే అవకాశాలున్నాయి.