వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒప్పుకోలేదని పారిపోయి పెళ్లి చేసుకున్న బాలికలు!
పాట్నా: పెద్దలు తమ ప్రేమకు అంగీకరించకపోతే ఓ అబ్బాయి, అమ్మాయి పారిపోయి పెళ్లి చేసుకోవడం సాధారణమే. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఓ అమ్మాయి.. మరో అమ్మాయితో పారిపోయి వివాహం చేసుకున్నారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం మోతిహరిలోని భాఘా ప్రాంతానికి చెందిన బాలికని అపహరించిందని ఖుషినగర్ జిల్లాకి చెందిన మరో బాలికపై తల్లిదండ్రులు కేసు నమోదు చేశారు.
ఈ మేరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు వీరిద్దరూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పట్టుబడ్డారు. విచారణ చేపట్టగా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డామని, ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో పారిపోయి గోరఖ్పూర్లో పెళ్లి చేసుకున్నామని తెలిపారు.
ఇద్దరు బాలికల వయస్సు వివరాలను సేకరించిన పోలీసులు, వారిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆ ఇద్దరు బాలికలు కూడా 9వ తరగతి చదువుతున్నారు.
Comments
English summary
In a rare case in Bihar two girls studying in class IX eloped and married each other. The entire case came to limelight after they were caught in Uttar Pradesh and interrogated.
Story first published: Monday, August 3, 2015, 17:04 [IST]