Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అర్దరాత్రి హీరో హీరోయిన్ కు సినిమా చూపించిన పోలీసులు, మిడ్ నైట్ లో అక్కడ సౌండ్ లు !

సినిమా రంగానికి చెందిన కొందరు నటీ నటులు నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉంటారు. స్యాండిల్ వుడ్ కు చెందిన కొందరు ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లి వచ్చారు. కొంతమంది నటీనటుల కారణంగా స్యాండిల్ వుడ్ నిత్యం లేనిపోని ఆరోపణలు మూటకట్టుకుంటుందని కొందరు నటీనటులు ఇప్పటికే బహిరంగంగా మండిపడ్డారు.

ఇటీవల విడుదలైన కన్నడ సినిమా విజయం సాధించడంతో రాజాజీనగర్‌లోని జట్లాగ్ రెస్టోబార్‌లో భారీ సక్సెస్ మీట్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీకి సినిమా యూనిట్ సభ్యులతో పాటు పలువురు స్యాండిల్ వుడ్ నటీనటులు హాజరైనారు. కానీ నిబంధనలను ఉల్లంఘించి నటీనటులు, నటీమణుల పిచ్చపాటిగా పార్టీ పెట్టినందుకు జట్లాగ్ రెస్టోబార్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది.

Sandwood celebrities celebrating liquor party in restobar even after Midnight, Bengaluru police registered a case
పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్ లకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగింపు సమయం పూర్తి అయిన తర్వాత కూడా అక్కడ లిక్కర్ పార్టీని అనుమతించినందుకు జట్లాగ్ రెస్టోబార్ యజమాని శశిరేఖా, మేనేజర్ ప్రశాంత్‌లపై బెంగళూరులోని సుబ్రహ్మణ్యనగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కర్ణాటక ఎక్సైజ్ చట్టం నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి అర్దరాత్రి 1 గంటల వరకు మాత్రమే రెస్టోబార్ తెరవడానికి అనుమతి ఉంది.

కానీ జట్లాగ్ రెస్టోబార్ ఈ నిబంధనను ఉల్లంఘించి, సెలబ్రిటీలను తెల్లవారుజామున 3.30 గంటల వరకు పార్టీ చేసుకోవడానికి అనుమతించింది.తెల్లవారుజామున 3 గంటలైనా రెస్టోబార్ మూసివేయకుండా తెరిచేఉండటంతో స్థానికులు సుబ్రహ్మణ్యనగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సుబ్రమణ్యనగర్ పోలీసులు జట్లాగ్ రెస్టోబార్‌పై దాడి చేసి వెంటనే బార్‌ను మూసివేశారు.

Sandwood celebrities celebrating liquor party in restobar even after Midnight, Bengaluru police registered a case
మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం ఆస్తులు వేలం, సొంత ఊరిలో కిరాతకుడికి ఎంత ఆస్తి ఉందంటే ?

వేకువ జామున 3.30 గంటల ప్రాంతంలో జట్లాగ్‌లో రెస్టోబార్ లో పార్టీ చేసుకుంటున్న సెలబ్రిటీలను, ప్రముఖులను వాళ్ల ఇంటికి పంపించారు. ఎక్సైజ్ శాఖ, పోలీసు శాఖ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు జట్లాగ్ రుస్టోబార్ యజమాని శశిరేఖా జగదీష్, మేనేజర్ అండ్ క్యాషియర్ ప్రశాంత్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

కేసు నమోదు చేసిన సుబ్రహ్మణ్య నగర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.కన్నడ చిత్రసీమ ఇటీవలే ఓ స్టార్ యాక్టర్ నటించిన సినిమా విడుదలై ఘనవిజయాన్ని అందుకుంది అందుకోసం చిత్ర యూనిట్ సభ్యులతో పాటు ప్రముఖులు అందరికి సక్సెస్ పార్టీ అని చెప్పి ఇక్కడ గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు. అయితే పార్టీలో పాల్గొన్న ప్రముఖుల పేర్లు, వివరాలను బెంగళూరు పోలీసులు బయటకు చెప్పలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+