7 లేదా 9న ప్రమాణం! పన్నీరుకు శశికళ హామీ: అతన్ని చితక్కొట్టిన మంత్రులు
తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే శాసన సభా పక్షం శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్వయంగా పన్నీరు సెల్వం ఆమె పేరును ప్రతిపాదించారు. దానికి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపార
చెన్నై: తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే శాసన సభా పక్షం శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్వయంగా పన్నీరు సెల్వం ఆమె పేరును ప్రతిపాదించారు. దానికి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
శశికళ ఈ నెల 7వ తేదీన లేదా 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్టీ శాసన సభా పక్ష నాయకురాలిగా ఎన్నికైన అనంతరం చిన్నమ్మ శశికళ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. జయలలిత మృతి అనంతరం రెండు నెలల తర్వాత ఆమె శాసన సభా పక్ష నేతగా ఎన్నికయ్యారు.

ఉప ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం
ముఖ్యమంత్రి పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్న పన్నీరు సెల్వం ఉప ముఖ్యమంత్రి కానున్నారు. ఈ మేరకు శశికళ నుంచి ఆయనకు హామీ వచ్చింది.
వ్యక్తిని చితకబాదిన మంత్రులు
అన్నాడీఎంకే కార్యాలయం ఎదుట ఓ వ్యక్తిని మంత్రులు పట్టుకొని చితకబాదారు. వెలుపల శశికళ ఫ్లెక్సీని ఒకరు చించివేశారు. దీంతో రెచ్చిపోయిన మంత్రులు అతనిని పట్టుకొని చితకబాదారు. స్థానిక వీడియో గ్రాఫర్లు దానిని చిత్రీకరించినటచ్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications