ఈయన సలహాతోనే.. ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్న శశికళ
అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి శశికళ జైలు ఊచలు లెక్కించడానికి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామితో పాటు కర్నాటక మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య కూడా కారణం.
చెన్నై: అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి శశికళ జైలు ఊచలు లెక్కించడానికి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామితో పాటు కర్నాటక మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య కూడా కారణం.
జయలలిత, ఆమె అనుచరుల పైన నమోదైన అఖ్రమాస్తుల కేసులో కర్నాటక తరఫున వాదించి వారు జైలు ఊచలు లెక్కపెట్టేలా చేశారు బీవీ ఆచార్య. అఫ్పుడు తన వాదనాపటిమతో జయలలితను జైలుకు పంపించారు.

ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం పైన ఆశలు పెట్టుకున్న శశికళతోను ఊచలు లెక్కపెట్టిస్తున్నారు. ఈ కేసును కర్నాటక హైకోర్టు కొట్టి వేయడంతో సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని కర్నాటక ప్రభుత్వానికి సలహా ఆచార్యనే ఇచ్చారు.
అప్పటికి ఆయన ఏజీగా పదవీ విరమణ చేయడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో శశికళ పాలిట ఆయన విలన్గా అవతరించారని కొందరు అంటున్నారు. 2004-2012 మధ్య ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించిన ఆచార్య వ్యక్తిగత కారణాలతో 2012లో రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications