పన్నీరుకు షాక్: సీనియర్ నేతలపై వేటు, శశికళ హింసించారన్న రిసార్ట్ ఎమ్మెల్యే
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తనకు ఎదురుతిరిగిన, అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు మద్దతు పలికిన నేతలపై సీరియస్గా స్పందించారు.
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తనకు ఎదురుతిరిగిన, అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు మద్దతు పలికిన నేతలపై సీరియస్గా స్పందించారు. ఇప్పటికే పన్నీరు సెల్వంను అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి తప్పించిన శశికళ.. ఇప్పుడు ఆయనకు మద్దతు తెలిపిన పార్టీ సీనియర్ నేతలపై కూడా చర్యలు తీసున్నారు.
భారీ షాక్: శశికళను దోషిగా నిర్ధారించిన సుప్రీం, నాలుగేళ్లు జైలు, పన్నీరింట సంబరం
పన్నీరుకు మద్దతు పలికిన సీనియర్ నేతలుకె.పాండ్యరాజన్, పీహెచ్. పాండ్యన్, పొన్నయన్, మునుస్వామి, ఎన్. విశ్వనాథన్లను బహిష్కరించారు శశికళ. ఈ చర్యల ద్వారా తనకు వ్యతిరేకంగా వ్యవహించిన వారికి పరోక్షంగా హెచ్చరికలు పంపారు.
తమిళనాడు అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో గంట గంటకీ అక్కడి రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుని ప్రకటించిన నేపథ్యంలో ఇక గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సుప్రీం తీర్పుపై సీఎం: పన్నీరును పార్టీ నుంచి తొలగించిన శశికళ, తెరపైకి పళనిస్వామి
రిసార్టులో హింసించారు: ఎమ్మెల్యే శరవణన్
అన్నాడీఎంకే పార్టీలో తనకు మద్దతు తగ్గకుండా ఉండేందుకు శశికళ నటరాజన్.. తమ ఎమ్మెల్యేలను రిసార్టుల్లో ఉంచిన విషయం తెలిసిందే. అయితే సోమవారం రాత్రి వేషం మార్చుకొని, గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి పారిపోయి పన్నీర్ సెల్వం వద్దకు వచ్చిన దక్షిణ మధురై ఎమ్మెల్యే శరవణన్ తాజాగా మీడియాతో మాట్లాడారు.
ఉద్రిక్తత: శశికళ అరెస్ట్ కోసం భారీగా పోలీసులు: పన్నీరు వైపు రిసార్ట్స్ ఎమ్మెల్యేల చూపు!
శశికళ అనుచరులు తమను రిసార్టులో చిత్రహింసలకు గురిచేశారని ఆయన అన్నారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలందరినీ ఒంటరిని చేసి అక్కడ ఉంచారని ఆయన ఆరోపించారు. తమ భావోద్వేగాలను సైతం పట్టించుకోకుండా తమను మానసికంగా, శారీరకంగా వేధించారని ఎమ్మెల్యే శరవణన్ చెప్పారు.
అన్నాడీఎంకే ప్రభుత్వమే కొనసాగాలి: పన్నీరు వద్దని శశికళ
మరోవైపు తాము ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా అక్కడి నుంచి పన్నీర్ సెల్వంకు మద్దతు తెలుపుతూ వస్తున్నామని తెలిపారు. తమ నియోజక వర్గాల ప్రజలతో ఫోన్ ద్వారా ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నామని ఆయన పేర్కొన్నారు. అయితే, తమకు రిసార్ట్లో మద్యం, అమ్మాయిలను సరఫరా చేశారంటూ వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలేనని ఆయన చెప్పారు.