శశికళ జైలుకు: గవర్నర్ కు ముందే తెలుసా ? అందుకే ఆలస్యం!
చెన్నై: జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు శిక్షపడుతుందని న్యాయనిపుణల సలహాలు, సూచనల తీసుకున్న గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు సుప్రీం కోర్టు తీర్పు కోసమే ఇన్ని రోజులు అలస్యం చేశారని తెలిసింది.
జయలలిత అక్రమాస్తుల కేసులో మంగళవారం సుప్రీం కోర్టు శశికళ నటరాజన్, ఇళవరసి, దివాకరన్ లకు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. తక్షణమే శశికళ తదితరులు లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడినట్లు అయ్యింది.
ఈనెల 5వ తేదిన ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. రెండు రోజుల తరువాత శశికళ మీద తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం తనతో బలవంతంగా రాజీనామా చేయించారని బహిరంగంగా ఆరోపించారు. అప్పటి నుంచి తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

తనకు మెజార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారని, తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారని, సీఎంగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని శశికళ స్వయంగా గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి మనవి చేశారు. ఈ విషయంపై గవర్నర్ కు రెండు సార్లు లేఖ కూడా రాశారు.
అయితే గవర్నర్ విద్యాసాగర్ రావు నుంచి శశికళకు స్పందన కరువైంది. ఈ పూర్తి వివరాలు బట్టి చూస్తే గవర్నర్ కు జరగబోయే పరిణామాలు ముందే న్యాయనిపుణలు నుంచి తెలుసుకోవడం వలనే ఆలస్యం చేస్తూ వచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా గవర్నర్ కేంద్రం సలహాలు తీసుకున్నారనే విషయం తెలిసిందే. గతవారం గవర్నర్ విద్యాసాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ శశికళకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో తీర్పు వస్తే తమిళనాడులో మళ్లీ రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
పన్నీర్ సెల్వం రాజీనామా చేసిన తరువాత శశికళకు మెజారీ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినా అక్రమాస్తుల కేసు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని గవర్నర్ నిర్ణయించారని, శశికళ నిర్దోషిగా బయటకు వచ్చి ఉంటే మాత్రం ఆమె ప్రమాణస్వీకారం చెయ్యడానికి గవర్నర్ కచ్చితంగా అవకాశం ఇచ్చే వారని సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీం కోర్టు తీర్పు రావాలనే గవర్నర్ ప్రమాణస్వీకారం ఆలస్యం చేస్తూ వచ్చారని సీనియర్ నాయకులు అంటున్నారు. అయితే గవర్నర్ సుప్రీం కోర్టు తీర్పు కోసం వేచి చూడటమే మంచిది అయ్యిందని పలువురు సీనియర్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications