షాక్: మరోసారి వడ్డీరేటును తగ్గించిన ఎస్ బి ఐ, ఏడేళ్ళ కిందటి రేటు
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేటును మరోసారి తగ్గించింది.
ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేటును మరోసారి తగ్గించింది.
కోటి రూపాయాల లోపు వార్షిక డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లను తగ్గించి 6.75 శాతంగా నిర్ణయించింది. తాజా తగ్గింపుతో ప్రస్తుత వడ్డీరేటు ఏడు సంవత్సరాల కనిష్టస్థాయికి చేరింది.

2010 సంవత్సరంలో ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఇదే రేటును ఎస్ బి ఐ అందించింది. కాగా, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు ఐసిసిఐ , హెచ్ డి ఎప్ సి కోటి రూపాయాలలోపు ఏడాది నికర డిపాజిట్లపై 6.9 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడ దాదాపు ఇదే రేటును కొనసాగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications