ఐఎన్ఎక్స్ కేసు: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని కార్తి చిదంబరంకు సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టై, సీబీఐ కస్టడీ ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరంకు ఊరట కావాలంటే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు గురువారం చెప్పింది. అలాగే, శుక్రవారం విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టును అపెక్స్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కార్తీ బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.
కాగా, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీకి నార్కో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రత్యేక కోర్టును సీబీఐ ఇప్పటికే అభ్యర్థించింది.

విచారణకు కార్తీ సహకరించడం లేదని సీబీఐ తెలిపింది. ప్రశ్నలకు డొంకతిరుగుడుగా జవాబులు చెబుతున్నారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో నార్కో పరీక్షలకు అభ్యర్థించింది.












Click it and Unblock the Notifications