జీఎస్టీ కౌన్సిల్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు-కేంద్ర, రాష్ట్రాలు కట్టుబడాల్సిన అవసరం లేదని క్లారిటీ
జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఎదురవుతున్న పలు సమస్యలు, జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల అమలుకు సంబంధించి నెలకొన్న వివాదాలకు చెక్ పెడుతూ సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ చేసే సిఫార్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.జీఎస్టీ కౌన్సిల్ చేసే సిఫార్సులు కేంద్రం, రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉంటేనే అమలు చేయాలని తెలిపింది.
జీఎస్టీ కౌన్సిల్ చేసేసిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలా వద్దా అనే విషయంలో దాఖలైన ఓ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 246ఏ ప్రకారం సమాన అధికారాలు ఉన్నాయని తెలిపింది. కేంద్రం ఆధ్వర్యంలో ఉంటే జీఎస్టీ కౌన్సిల్ చేసే సిఫార్సుల్ని రాష్ట్రాలు కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం లేదని, అలాగ కేంద్రం కూడా అమలు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. అలాగే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సొంత చట్టాలు చేసుకోవచ్చని కూడా సూచించింది.

కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆచరణీయ పరిష్కారాన్ని సాధించడానికి జిఎస్టి కౌన్సిల్ సామరస్యపూర్వకంగా పని చేయాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సులు సహకార చర్చ యొక్క ఫలితం మాత్రమేనని, సమాఖ్య వ్యవస్ధల్లో ఒకటి ఎల్లప్పుడూ అత్యధిక అధికారాలు కలిగి ఉండటం అత్యవసరం కాదని కేంద్ర ప్రభుత్వ పైచేయిని ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications