వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేడే నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల!: తెలంగాణకు కూడా?
Recommended Video
నేడే
నాలుగు
రాష్ట్రాలకు
ఎన్నికల
షెడ్యూల్
విడుదల!
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం మీడియా సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరంలతోపాటు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులతో రెండ్రోజులుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశమవుతున్నారు.
శనివారం తెలంగాణకు సీఈసీ సాంకేతిక నిపుణులు రానున్నారు. తెలంగాణలో ఓటర్ల జాబితా రూపొందించే విషయంలో సాంకేతిక సమస్యలను పరిశీలించనున్నారు.
అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అయితే ప్రస్తుతం సాంకేతిక సమస్యలు వస్తున్నందున ఈ అంశంపై శుక్రవారం నాటి సమావేశంలో చర్చించి సాంకేతిక నిపుణులను సీఈసీ పంపిస్తోంది.
Comments
assembly elections rajasthan madhya pradesh chhattisgarh mizoram telangana election commission అసెంబ్లీ ఎన్నికలు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మిజోరాం తెలంగాణ ఎన్నికల సంఘం
English summary
The Election Commission Saturday will announce dates for the Madhya Pradesh, Chhattisgarh, Rajasthan and Mizoram Assembly elections. The EC is expected to make the announcement in a press conference at 12.30 pm. The Model Code of Conduct will come into force after the announcement is made.