Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క్రమశిక్షణ!: విద్యార్థులకు గుండ్లు కొట్టించేశారు

బెంగళూరు: ఓ పాఠశాల ఉపాధ్యాయులు క్రమశిక్షణ పేరుతో తమ వద్ద చదువుకుంటున్న 15 మంది విద్యార్థులకు బలవంతంగా గుండ్లు కొట్టించేశారు. అంతేగాక, వారి వెంట్రుకలను బ్యాగులో పెట్టి ఇంటికి పంపించేశారు. ఈ ఘటన కర్ణాటకలోని కొడగు జిల్లా వీరాజీపేట్‌ పట్టణంలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. వినాయక ఇంగ్లీష్‌ మీడియం అనే స్కూల్‌లో రెండు-ఏడు తరగతులు చదువుకుంటున్న విద్యార్థులు 15 మందికి గుండ్లు కొట్టించి తల వెంట్రుకల్ని వారి బ్యాగులో పెట్టించి ఇంటికి పంపించారు. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

యాజమాన్యాన్ని ఈ విషయమై వారు కలవాలని ప్రయత్నించగా వారెవరూ అందుబాటులో లేరు. ఫోన్లు స్విచ్‌ఆఫ్‌ చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడి గదికి సైతం తాళాలు వేసి ఉన్నాయి. ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థుల క్రమశిక్షణలో భాగంగానే వారు ఈ పనిచేశారని చెబుతున్నారు.

School Tonsures Boys in Karnataka, Parcels Hair to Parents

కాగా, ఈ విషయమై ఎస్పీ వార్దికా కతియార్‌ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎవరూ ఈ ఘటనపై తమకు ఫిర్యాదు చెయ్యలేదన్నారు. అయినా ఈ విషయంపై తాము వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.

యాజమాన్యం విద్యార్థులకు ఎందుకు గుండ్లు గీయించిందో కారణాలు తెలియ రాలేదన్నారు. పాఠశాల ప్రస్తుతం మూతపడిందని శుక్రవారం తిరిగి తెరుచుకుంటుందని, ఈ ఘటనపై తాము ప్రత్యేకంగా దృష్టి సారించామని బిఈఓ హెచ్‌కె పాండు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+