వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాళ్లూ చేతులూ కట్టేసి అమ్మాయిపై రేప్: ఆ తర్వాత హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో మానవ మృగాలు రెచ్చిపోయాయి. ఓ అమ్మాయిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను దుండగులు కిరాతకంగా హత్య చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు జిల్లా గుడియాత్తం సమీపంలో ఆరో తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేశారు. వేలూరు జిల్లా కేవీ కుప్పం సమీపంలోని కాంగుప్పం గ్రామానికి చెందిన విజయకుమార్ కూలీ. ఇతని రెండో కుమార్తె కీర్తిక(11) మార్చనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది.

సోమవారం పాఠశాలకు వెళ్లిన కీర్తిక రాత్రి అయినప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ తెలియరాలేదు. పాఠశాల నుంచి ఇంటికి వచ్చే దారిలోని పెరియాంకుప్పం వద్ద ఉన్న మామిడితోటలో కీర్తిక మృతదే హాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కేవీ కుప్పం పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసన్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పరిశీలించారు.

Rape

కీర్తిక కాళ్లు, చేతులు కట్టి తలపై బాటిల్‌తో కొట్టిన గాయాలున్నట్లు గుర్తించారు. మృతదేహం పక్కన మద్యం బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు ఉండడాన్ని పరిశీలించారు. విద్యార్థిని సైకిల్ మామిడి తోట పక్కన ఉన్నట్లు కనుగొన్నారు. విద్యార్థిని పాఠశాల నుంచి వస్తుండగా, కొందరు అడ్డుకుని మామిడి తోటలోకి లాక్కెళ్లినట్లు భావిస్తున్నారు. విద్యార్థిని స్కూల్ బ్యాగును తోటలో ఒక పక్క విసిరి వేశారు. విద్యార్థిని కాళ్లు, చేతులు కట్టి వేసి, అత్యాచారం చేసి, తరువాత బాటిల్‌తో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

సంఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేపట్టారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా కీర్తిక స్నేహితులు ముగ్గురి వద్ద విచారణ చేస్తున్నారు. డీఐజీ విచారణ: విషయం తెలుసుకున్న డీఐజి తమిళ్ చంద్రన్, ఎస్పీ సెంథిల్‌కుమారి సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ రిటో అనే విద్యార్థి వద్దకు వెళ్లింది.

అనంతరం అక్కడ నుంచి విద్యార్థి ఇంటిని చుట్టి దురైమూలం గ్రామం వద్దకు వెళ్లి నిలిచిపోయింది. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తెలిసినవారే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఓ బాలుడితో ఆమెను చూసినట్లు కొంత మంది చెబుతున్నారు. ఆమెపై ఒక్కరి కన్నా ఎక్కువ మంది అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

English summary
A Class 6 student at a government high school in the Vellore district of Tamil Nadu was raped and murdered by unidentified people. Her body was dumped in a mango orchard near Maachanur village in the district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X