విచారణ: దారితప్పిన రాజ్నాథ్ సింగ్ హెలికాప్టర్
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల జార్ఖండ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పిందట. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ సాగుతోంది. కాగా, మఝగావ్లో ల్యాండ్ కావాల్సిన రాజ్నాథ్ సింగ్ హెలికాప్టర్.. బడా జమ్దా ప్రాంతంలో దిగింది.
సగం దూరం ప్రయాణించిన తర్వాత తాము వేరే రూట్లో ప్రయాణం చేస్తున్న సంగతిని పైలట్ గుర్తించాడు. అప్పటికే చాలా దూరం ప్రచారం చేశారట. దీంతో మళ్లీ సరైన మార్గంలో తీసుకెళ్లాడు. కాగా, చైబాసా ప్రాంతంలోని బడాజమ్దా ఎంతో సమస్యాత్మక ప్రాంతం కావడంతో రాజ్నాథ్ భద్రతపై ఆందోళన నెలకొంది.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత కీలక నేత రాజ్నాథ్ కావడంతో అధికారులకు చెమటలు పట్టాయట. కాగా, ప్రస్తుతం పైలట్ ఎలా దారితప్పాడన్న విషయంపై విచారణ జరుపుతున్నారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ముందు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, మంగళవారం జార్ఖండ్లో నక్సల్స్ బెదిరింపుల మధ్య తొలి దశ ఎన్నికల పోలింగ్ జరిగింది.