పడవల ద్వారా చొరబడేందుకు ఉగ్రవాదుల ప్లాన్: అప్రమత్తంగా భారత బలగాలు
శ్రీనగర్: అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)ల వెంబడి పాకిస్థాన్ వైపు ఉన్న ఉగ్ర స్థావరాల సమీపంలో చిన్నపాటి రబ్బర్ పడవలు ఉన్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్లోని భారత భద్రతా బలగాలను అప్రమత్తం చేశాయి.

జమ్మూ డివిజన్లోని అఖ్నూర్, కథువా, సాంబాల్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పాకిస్థాన్ వైపు 13 రబ్బరు పడవలను గుర్తించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదులు కృష్ణఘాటీ నదిని ఉపయోగించుకుని భారత్లోకి చొరబడే ప్రమాదం ఉందని ఐబీ వర్గాలు హెచ్చరించాయి.
ఈ నేపథ్యంలో భారత భద్రతా దళాలు గురేజ్ సెక్టార్లో హై అలర్ట్ ప్రకటించాయి. ఎల్ఓసీ, సరిహద్దు వెంబడి గస్తీ దళాలను పెంచాయి. పాకిస్థాన్లో శిక్షణ పొందిన కమాండోలు, ఉగ్రవాదులు గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కచ్, సర్ క్రిక్ల గుండా చిన్న పడవల్లో మనదేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే ఐబీ హెచ్చరికలు చేసింది. తాజాగా పడవలను గుర్తించి భద్రతా దళాలను అప్రమత్తం చేసింది.
-
మహారాష్ట్రలోని అండర్ వరల్డ్ డాన్ "దావూద్ ఇబ్రహీం" ఆస్తులు వేలం..! -
పాకిస్తాన్ ‘డెడ్ లైన్’.. వణుకుతున్న ఐఎస్ఐ అగ్రనేతలు! -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications