పాక్ పీచాన్ని అలా అణచివేశాం
Pahalgam Terror Attack: ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పహల్గామ్ ఉగ్రదాడి. 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల ఘాతుకానికి అమెరికా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్ దాకా దాదాపుగా అన్ని దేశాలు స్పందించాయి. భారత్కు అండగా నిలిచాయి. ఉగ్రవాద నిర్మూలనకు సహకరిస్తామని వెల్లడించాయి.
ఈ దిగ్భ్రాంతికర ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. పాకిస్తాన్పై కఠిన ఆంక్షలను విధించింది. ఇండస్ రివర్ ట్రీటీ సహా పలు కీలక నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది. అట్టారీ-వాఘా సరిహద్దు చెక్పోస్ట్ను మూసివేయడమే కాకుండా దేశంలో నివస్తోన్న పాకిస్తానీయులనూ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది.

దీనిపై తాజాగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ డ్రోన్లు, విధ్వంసక మందుగుండు సామగ్రిని ఉపయోగించడాన్ని భారత సైన్యం విజయవంతంగా అడ్డుకున్న తీరును వివరించారు. ఈ చర్యలో భారత్ కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపారు.
ఢిల్లీలో జరిగిన డిఫెన్స్ వర్క్షాప్లో అనిల్ చౌహాన్ మాట్లాడారు. మే 10న పాకిస్తాన్ నిరాయుధ డ్రోన్లు, విధ్వంసక మందుగుండు సామగ్రిని ఉపయోగించిందని, వాటిలో ఏ ఒక్కటి కూడా భారత సైనిక లేదా పౌర మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించలేదని అన్నారు. పాక్ ప్రయోగించిన డ్రోన్లను నిర్వీర్యం చేశామని, కొన్నింటిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు.
మానవరహిత వైమానిక వాహనాల వ్యూహాత్మక వినియోగం, స్వదేశీ కౌంటర్ డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని చౌహాన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. యుద్ధంలో డ్రోన్ల వినియోగం పరిణామాత్మకమైనదని, వాటి వినియోగం యుద్ధంలో చాలా విప్లవాత్మకమైనదని వ్యాఖ్యానించారు.
వాటి వినియోగం, పరిధి పెరిగే కొద్దీ సైన్యం డ్రోన్లను విప్లవాత్మక పద్ధతిలో ఉపయోగించడాన్ని ప్రారంభించామని అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. రక్షణ వ్యవస్థలో విదేశీ పరిజ్ఞానం కంటే సొంత సాంకేతికపైనే ఆధారపడాల్సిన అవసరం ఉందని, అది అన్నింటికీ సమాధానం చెబుతుందని అన్నారు.
యుద్ధ రీతిలో వచ్చిన విస్తృత చారిత్రక మార్పును వివరించారు. యుద్ధ రీతుల్లో వచ్చిన పరిణామాత్మక మార్పులు.. ఆయుధాలను మరింత సరళీకరించాయని వ్యాఖ్యానించారు. యుద్ధ పరికరాలను చిన్నవిగా, వేగంగా, తేలికగా, మరింత సమర్థవంతంగా, సరసమైనవిగా చేశాయని చెప్పారు.
గతంలో మన దగ్గర భారీ, బరువైన రైఫిల్స్ ఉండేవని, వాటిస్థానంలో ఇప్పుడు చిన్నవిగా, తేలికగా, ఎక్కువ రేంజ్ ను కలిగి ఉన్న అత్యాధునిక ఆయుధాలు వచ్చాయని చెప్పారు. యుద్ధ ట్యాంకులు, ఎయిర్ క్రాఫ్ట్ లకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని పేర్కొన్నారు. నిన్నటి ఆయుధాలతో నేడు యుద్ధం చేయలేమని స్పష్టం చేశారు. కాలానుగుణంగా అత్యాధునిక ఆయుధాలు తప్పవని అన్నారు.
-
పాకిస్థాన్ లో చిక్కుకున్న IAF పైలట్..? భారత్ సంచలన ఆపరేషన్..! -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!











Click it and Unblock the Notifications