Selfie: భార్య చెల్లితో బావ ఎంజాయ్, సెల్ఫీ కోసం ఫోజులు, వెనుక నుంచి ఏం వచ్చిదంటే, ప్రాణం పోయింది!
లక్నో/ఉత్తరప్రదేశ్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. భార్యతో కలిసి అతను ఎక్కువగా అత్తారింటికి వెళ్లి వస్తున్నాడు. భార్యకు అందమైన మరదలు ఉంది. మరదలితో అక్క మొగుడు చాలా చనువుగా ఉంటున్నాడు. భార్యకు తెలీకుండా ఆమె భర్త మరదలితో సినిమాలు, షికార్లు తిరుగుతున్నాడు. మరదలితో హ్యాపీగా బయట తిరుగుతున్న విషయం భార్యకు తెలీకుండా భర్త చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చూడముచ్చటగా ఉన్న ఏరియాలోని రైల్వే ట్రాక్ దగ్గర కొంత సేపు వాకింగ్ చేసిన బావ, అతని మరదలు కొంతసేపు ఎంజాయ్ చేశారు.
నది మీద ఉన్న రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ చాలా దూరం వెళ్లిపోయారు. నది మీద ఉన్న రైల్వే ట్రాక్ మీద సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో వెనుక వైపు నుంచి వచ్చిన రైలును చూసి బావ, మరదలు పరుగు తీశారు. కింద నది ఉండటం, తప్పించుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఇద్దరూ కేకలు వేశారు. ఆ సమయంలో రైలు ఢీకొనడంతో బావ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రైలు డీకొని మరదలికి తీవ్రగాయాలు కావడంతో ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది.

భార్యతో హ్యాపీలైఫ్
ఉత్తరప్రదేశ్ లోన కుశీనగర్ సమీపంలోని ఖడ్వా ప్రాంతంలో జాటా బజార్ లో తస్లీన్ సిద్దికి అలియాస్ సిద్దికి (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం అత్తరున్నీసా అనే మహిళను సిద్దిఖి వివాహం చేసుకున్నాడు. అత్తరున్నీసాను వివాహం చేసుకున్న సిద్దిఖి అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు.

బావా మరదలు జల్సాలు
భార్యతో కలిసి సిద్దికి ఎక్కువగా అత్తారింటికి వెళ్లి వస్తున్నాడు. సిద్దిఖి భార్య అత్తరున్నీసాకు అందమైన షబీనా అనే మరదలు ఉంది. మరదలు షబీనాతో ఆమె అక్క మొగుడు సిద్దిఖి చాలా చనువుగా ఉంటున్నాడు. భార్యకు తెలీకుండా భర్త సిద్దికి అతని మరదలు షబీనాతో సినిమాలు, షికార్లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.

నది మీద ఉండే రైల్వే ట్రాక్ మీద వాకింగ్
మరదలు షబీనాతో హ్యాపీగా బయట తిరుగుతున్న విషయం భార్యకు తెలీకుండా సిద్దిఖి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చూడముచ్చటగా ఉన్న గండక్ నది ఏరియాలోని రైల్వే ట్రాక్ దగ్గర కొంత సేపు సిద్దికి, అతని మరదలు షబీనాతో వాకింగ్ చేశాడు. తరువాత బావ, అతని మరదలు షబీనా కొంతసేపు ఎంజాయ్ చేశారు.

సెల్ఫీ దెబ్బకు బావ ప్రాణం పోయింది
గండక్ నది మీద ఉన్న రైల్వే ట్రాక్ మీద సిద్దికి, అతని మరదలు షబీనా నడుచుకుంటూ చాలా దూరం వెళ్లిపోయారు. నది మీద ఉన్న రైల్వే ట్రాక్ మీద సిద్దికి, షబీనా సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో వెనుక వైపు నుంచి వచ్చిన రైలును చూసి బావ సిద్దికి, అతని మరదలు షబీనా ప్రాణ భయంతో పరుగు తీశారు. కింద నది ఉండటం, తప్పించుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఇద్దరూ కేకలు వేశారు. ఆ సమయంలో రైలు ఢీకొనడంతో సిద్దికి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రైలు డీకొని మరదలు షబీనాకుకి తీవ్రగాయాలు కావడంతో ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications