'ఇక్కడ సెల్ఫీ, ఫోన్ బటన్ నొక్కితే చైనాలో ఉద్యోగాలు'
ప్రధాని నరేంద్ర మోడీ సెల్ఫీల పట్ల మోజు పడుతున్నారని, దీని వల్ల చైనాకు లాభం తప్ప మనకు ఎలాంటి లాభం లేదని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సెల్ఫీల పట్ల మోజు పడుతున్నారని, దీని వల్ల చైనాకు లాభం తప్ప మనకు ఎలాంటి లాభం లేదని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధాని చేపట్టిన మేకిన్ ఇండియా పూర్తిగా విఫలమైందన్నారు. మోడీ తీసుకునే సెళ్పీ వల్ల చైనాలో యువతకు లాభమన్నారు. ఇక్కడి యువతకు మాత్రం ఏమీ లాభం లేదన్నారు.

తయారీ రంగంలో చైనా అక్కడి యువతకు ఉపాధి కల్పిస్తుంటే, భారత్ మాత్రం యువతను నిరుద్యోగులుగా మారుస్తోందన్నారు. మీరు ఫోన్ బటన్ నొక్కే ప్రతిసారి ఓ యువకుడికి చైనాలో ఉద్యోగం లభిస్తోందని రాహుల్ అన్నారు.
చైనా ప్రభుత్వం ప్రతి 24 గంటలకు 50 వేల మందికి ఉపాధి కల్పిస్తుంటే భారత్లో మాత్రం ఆ సంఖ్య 450 మాత్రమే అని అన్నారు.












Click it and Unblock the Notifications