ఓటే నా ప్రాణం, ఓటు లేకపోవడంతో ప్రాణం వీడీన వ్యక్తి, కేరళలో ఘటన
కొంతమంది ఓటు వేసిన వేయకపోయినా పెద్దగా పట్టించుకోరు, మరి పట్టణాల్లో అయితే అసలు బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. తాజగా గా హైద్రాబాద్ నగర ఓటర్లను ఇందుకు ఉదహరణంగా చెప్పుకోవచ్చు. అయితే గ్రామాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్దంగా ఉంటుంది. ఓటు అనేది తమ ప్రాణంతో సమానం .అది వేయకపోతే తమ పోయినట్టే భావన గతకాలపు పెద్దల్లో ఉంటుంది. అందుకే ఓటు వేసేందుకు వెళ్లిన పలువురు వయస్సు మీద పడిన వారు పదిమంది వరకు క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోయారు. మరోకరు అసలు ఓటరు లిస్టులో తన పేరులేదని మృతి చెందారు.
గ్రామాల్లో ఓటు వేయకపోతే ప్రాణం పోయినట్టే లెక్కా,,
తాజాగా ఓటువేసేందుకు వెళ్లిన ఓ వృద్దుడికి ఓటు తన ప్రాణం అయింది. గతంలో ఓటు ప్రాణంతో సమానం అనే మాటలు విన్నాం ,,ఓటు వేయకపోతే చనిపోయినట్టే లెక్క అనే ప్రచారం గతంలో ఉండేది ,దీంతో పెద్దవారు ఓటును వినియోగించుకునేందుకు ఎంత కష్టమైన భరించేవారు, ఇప్పటికి కూడ ఓటు వేసేందుకు ఉదయం క్యూలో కనపడేది ముందుగా వయస్సు మీద పడిన వారే ,అయితే మరి ఓటు ఉండి వేయకపోతే ప్రాణం పోయినట్టు కాని అసలు ఓటే లేకపోతే కూడ ప్రాణం పోగోట్టుకున్న పరిస్థితి కేరళ లో కనిపించింది.
ఓటు లేదని తెలుసుకున్న వ్యక్తి హఠాన్మరణం ,
మూడవ విడతలో జరిగిన ఎన్నికల్లో భాగంగా కేరళలో ఒకేరోజు నలుగురు వ్యక్తులు చనిపోయారు. ఓటరు జాబితాలో పేరు లేదని తెలుసుకున్న మణి అనే వ్యక్తి అక్కడిక్కడే కుప్పకూలిపోయిన ఘటన జరిగింది.కాగ వేర్వేరు ప్రాంతాల్లో సుమారు 10 మంది వరకు ఓటింగ్ సమయంలో మృతి చెందారు.
పోలీంగ్ క్యూలోనే నిలబడి మరో 5గురు మృతి
కాగా పోలింగ్ బూత్ లో ఓట్లు వేసేందుకు వెళ్లిన ఇద్దరు వయసు పైబడిన వ్యక్తులు కూడ ఇతర లోక్సభ నియోజకవర్గాల్లో చనిపోయారు. వడకర లోక్ సభ నియోజకవర్గంలో చోక్లీలోని రామ విలాసం పాఠశాలలో పోలింగ్ బూత్ లో విజయ అనే 65 సంవత్సరాల మహిళ వరుసలో నిలబడే క్రిందపడిపోగా, పథనం తిట్టా జిల్లాలో పాపచన అనే మరో 80 సంవత్సరాల వ్యక్తికూడ క్యూలైన్లోనే నిల్చుని కుప్పకూలిపోయాడు .ఇలా పలు ప్రాంతాల్లో క్యూలో నిలబడిన సుమారు 10మంది మృతి చెందినట్టు తెలుస్తోంది.