మరో జర్నలిస్ట్: మొహాలిలో జేకె సింగ్ సహా అతని తల్లి హత్య..
గుర్తు తెలియని దుండగులు సీనియర్ జరల్నిస్ట్ జేకె సింగ్ సహా అతని తల్లి గురుచరణ్ కౌర్(92)ని హత్య చేశారు.
న్యూఢిల్లీ మొహాలిలో జంట హత్యలు చోటు చేసుకున్నాయి. గుర్తు తెలియని దుండగులు సీనియర్ జరల్నిస్ట్ జేకె సింగ్ సహా అతని తల్లి గురుచరణ్ కౌర్(92)ని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆయన నివాసం వద్దే దుండగులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
శనివారం మధ్యాహ్నం సింగ్ను కలుసుకునేందుకు ఓ వ్యక్తి ఆయన ఇంటికి వచ్చినట్లు సమాచారం. అయితే ఎంతకీ వారు తలుపు తీయకపోవడంతో.. అనుమానం వచ్చిన అతను పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని లోపలికి వెళ్లి పరిశీలించారు.

ఇంట్లో సింగ్ అతని తల్లి రక్తపు మడుగులో పడి ఉండటం పోలీసులు గుర్తించారు. ఇద్దరి మృతదేహాలు పక్కపక్కనే పడి ఉన్నాయి. ఘటన తర్వాత సింగ్ కారు కనిపించకుండా పోయిందని పోలీసులు తెలిపారు.
జేకె సింగ్ గతంలో 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్' ఎడిటర్గా పనిచేశారు. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ జేకె సింగ్ హత్యను ఖండించారు. హంతకులను పోలీసులు తక్షణమే పట్టుకోవడానికి ప్రయత్నించాలన్నారు.
కాగా, కర్ణాటకలో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య ఇంకా మరిచిపోకముందే మరో జర్నలిస్ట్ ఇలా హత్యకు గురవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications