వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మమతా బెనర్జీకి 'నారద' షాక్: సుప్రీం కోర్టులో చుక్కెదురు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టు మంగళవారం నాడు షాకిచ్చింది. నారద స్టింగ్ ఆపరేషన్ పైన సిబిఐ చేత దర్యాఫ్తు చేయించాలన్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టు మంగళవారం నాడు షాకిచ్చింది. నారద స్టింగ్ ఆపరేషన్ పైన సిబిఐ చేత దర్యాఫ్తు చేయించాలన్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
ఈ స్టింగ్ ఆపరేషన్లో నిందితులపై సిబిఐ దర్యాఫ్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రత్యేక దర్యాఫ్తు బృందం చేత దర్యాఫ్తు చేయించాలన్న విన్నపాన్ని కూడా సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
2016లో నారద స్టింగ్ ఆపరేషన్ జరిగింది. టీఎంసీ ఎంపీలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. దీనిపై మమతా బెనర్జీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ ఆమెకు చుక్కెదురయింది.
Comments
English summary
In a major setback to West Bengal Chief Minister Mamata Banerjee, the Supreme Court has said that the Narada sting case will be probed by the Central Bureau of Investigation.
Story first published: Tuesday, March 21, 2017, 16:38 [IST]