కోర్టులో సోనియా, రాహుల్ గాంధీలకు చుక్కెదురు
నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి కోర్టులో చుక్కెదురయింది. నేషనల్ హెరాల్డ్ కంపెనీ పన్ను ఎగవేత కేసులో ఐటీ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురయింది. నేషనల్ హెరాల్డ్ కంపెనీ అకౌంట్స్ తనిఖీ చేసేందుకు ఐటీ శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసులో సోనియా, రాహుల్లు ఐటీ విచారణ ఎదుర్కొన్నారు.

బీజేపీ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి 2012లో దీనిపై ప్రయివేటు కేసు వేశారు. నేషనల్ హెరాల్డ్ పేరుతో వారు ఫండ్స్ను మిస్ యూజ్ చేస్తున్నారని ఆయన అరోపించారు. కాగా, ఈ ఆదేశాలపై తాము సుప్రీం కోర్టుకు వెళ్తామని రాహుల్ గాంధీ చెప్పారు.












Click it and Unblock the Notifications