విషాదం: హిమపాతంలో చిక్కుకున్న ఏడుగురు సైనికులు మృతి
న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలో హిమపాతంలో కూరుకుపోయిన ఏడుగురు సైనికుల ఘటన విషాదాంతమైంది. ఫిబ్రవరి 6న అరుణాచల్ ప్రదేశ్లోని కమెంగ్ సెక్టార్లోని ఎత్తైన ప్రాంతంలో హిమపాతం సంభవించి ఏడుగురు ఆర్మీ సిబ్బంది మరణించినట్లు నిర్ధారించారు.
భారత సైన్యం తెలిపిన వివరాల ప్రకారం.. హిమపాతం జరిగిన ప్రదేశం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్లను ప్రదేశానికి రప్పించింది.

గత కొన్ని రోజులుగా భారీ మంచు కురుస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రతికూల వాతావరణం నెలకొందని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. చుమే గ్యతేర్ ప్రాంతం తవాంగ్ జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి 100 కి.మీ దూరంలో ఉంది.
ఏడుగురు సైనికులు 19వ జమ్మూ & కాశ్మీర్ రైఫిల్స్, భారత సైన్యంలోని పదాతిదళ రెజిమెంట్కు చెందినవారు. మరోవైపు ఏడుగురు సైనికుల మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్లో మంచు తుఫానులో విధి నిర్వహణలో ఉన్న మన 7 మంది వీర జవాన్లు దురదృష్టవశాత్తు మరణించడం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. మన జవాన్లు నిస్వార్థంగా మన భద్రత కోసం ప్రయత్నిస్తున్నారు. జవాన్లకు, వారి కుటుంబం, సహచరులు నా వందనం. నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను' అని మమత అన్నారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications